తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పుల్వామా' అమరుల కోసం రాహుల్ పూజలు

కేరళ వయనాడ్​లోని తిరునెల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ, తన పూర్వీకులతో పాటు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By

Published : Apr 17, 2019, 12:50 PM IST

తిరునెల్లి ఆలయంలో రాహుల్​ గాంధీ పూజలు

తిరునెల్లి ఆలయంలో రాహుల్​ గాంధీ పూజలు

కేరళ వయనాడ్​లోని బ్రహ్మగిరి కొండపై ఉన్న తిరునెల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. సంప్రదాయ దుస్తుల్లో కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హిందూ ఆచారాల ప్రకారం పాపనాశిని నది వద్ద ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ, తన పూర్వీకులతో పాటు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని పూజలు నిర్వహించారు రాహుల్. రాజీవ్​గాంధీ అస్థికలను అప్పట్లో ఈ నదిలోనే కలిపారు.

అమేఠీతోపాటు వయనాడ్​ లోక్​సభ స్థానానికి రాహుల్​ పోటీ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details