తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రఫేల్​పై నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా'

రఫేల్​ తీర్పుపై తన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు తప్పుగా ఆపాదించారని సుప్రీం కోర్టుకు నివేదించారు రాహుల్​ గాంధీ. తన వ్యాఖ్యలపై సుప్రీం ఇచ్చిన కోర్టు ధిక్కరణ నోటీసుకు స్పందిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు.

By

Published : Apr 22, 2019, 2:17 PM IST

Updated : Apr 22, 2019, 4:52 PM IST

ధిక్కరణ నోటీసుపై సుప్రీంకు రాహుల్ వివరణ

రఫేల్​ తీర్పుపై తన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు తప్పుగా ఆపాదించారని సుప్రీంకోర్టుకు వివరించారు రాహుల్​ గాంధీ. రఫేల్​ వ్యవహారంలో భాజపా ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై సుప్రీం కోర్టు వివరణ కోరగా.. రాహుల్ అఫిడవిట్​ సమర్పించారు.

రాహుల్​ గాంధీ ఆపాదించిన 'చౌకీదార్​ చోర్​ హై' అనే అభ్యంతరకర వ్యాఖ్యలు రఫేల్​ తీర్పులో ఎక్కడా ప్రస్తావించలేదని ఈ నెల 15న సుప్రీం స్పష్టం చేసింది. భాజపా ఎంపీ మీనాక్షి వేసిన పిటిషన్​పై ఈ నెల 22 లోపు వివరణ ఇవ్వాలని రాహుల్​ గాంధీకి నోటీసులిచ్చింది. రాహుల్ ప్రమాణ పత్రంపై మంగళవారం విచారణ జరగనుంది.

ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు వక్రీకరించారని అఫిడవిట్​లో పేర్కొన్నారు రాహుల్​. కోర్టు ప్రతిష్ఠను తగ్గించాలనే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి మోదీ కూడా రఫేల్​ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పును తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారని... ప్రభుత్వానికి సుప్రీం తీర్పుతో సచ్ఛీలత పత్రం వచ్చిందని పేర్కొంటున్నారని అఫిడవిట్​లో ఆరోపించారు రాహుల్.

ఇదీ చూడండీ:దిల్లీలో 6 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

Last Updated : Apr 22, 2019, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details