తెలంగాణ

telangana

'మోదీజీ.. ఆ పని కూడా చేసిపెట్టండి ప్లీజ్​'

By

Published : Mar 11, 2020, 12:56 PM IST

Updated : Mar 11, 2020, 2:16 PM IST

మధ్యప్రదేశ్​లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారంటూ ట్విట్టర్​లో​ విమర్శలు గుప్పించారు రాహుల్​. ముడి చమురు ధరలు దిగొచ్చిన నేపథ్యంలో సామాన్యులపై పెట్రో భారం తగ్గించేలా చర్యలు చేపట్టాలని మోదీని కోరారు.

rahul latest news
మధ్యప్రదేశ్​ సంక్షోభానికి మోదీయే కారణం

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేంచుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రపన్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్​ సర్కారును కూల్చే పనిలో నిమగ్నమై అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 35శాతం తగ్గిన విషయాన్ని ఆయన గుర్తించడం లేదని ట్విట్టర్​ వేదికగా విమర్శించారు రాహుల్​.

లీటర్​ పెట్రోల్ ధర రూ.60లోపు తీసుకురాగలరా? తద్వారా దేశ ప్రజలకు ప్రయోజనం చేకూర్చగలరా? అంటూ ప్రశ్నించారు రాహుల్​.

"ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో మీరు తీరిక లేకుండా ఉన్నారు. అందుకే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 35శాతం పడిపోయిన విషయాన్ని గమనించడం లేదు. లీటర్ పెట్రోల్​ ధరను రూ.60లోపు ఉండేలా చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చగలరా? మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేలా చేయలేరా? "

-రాహుల్ గాంధీ, ట్వీట్​.

మధ్యప్రదేశ్​లో జ్యోతిరాదిత్య సింధియా తన అనుచర ఎమ్మెల్యేలతో నేడు భాజపాలో చేరనున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమైంది. అధికారం చేపట్టిన 15నెలలకే గద్దెదిగే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మోదీని లక్ష్యంగా చేసుకుని ట్వీట్​ చేశారు రాహుల్​.

ఇదీ చూడండి: కాషాయ తీర్థం పుచ్చుకోనున్న సింధియా

Last Updated : Mar 11, 2020, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details