తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ అసమర్ధత వల్లే కరోనా కేసుల్లో రెండో స్థానం' - కరోనా కేసుల్లో భారత్​ రెండో స్థానం

కరోనా కేసుల్లో భారత్​ రెండో స్థానంలో నిలవటానికి మోదీ ప్రభుత్వ అసమర్థతే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Rahul Gandhi accuses Modi government of 'mismanagement' of COVID situation
'మోదీ అసమర్ధత వల్లే కరోనా కేసుల్లో రెండో స్థానం'

By

Published : Sep 8, 2020, 10:47 PM IST

కరోనా మహమ్మారి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అసమర్థత వల్లే దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. అందువల్లే ప్రపంచంలో కరోనా ప్రభావిత దేశాల్లో బ్రెజిల్​ను వెనక్కి నెట్టి భారత్ రెండోస్థానానికి చేరిందని ట్వీట్​ చేశారు.

"కరోనా నియంత్రణలో లోపం వల్ల కొవిడ్​ కేసుల్లో భారత్​ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది. గత వారాంతంలో అమెరికా, బ్రెజిల్​ కంటే దేశంలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో భారత్ వాటా 40 శాతం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి."

---రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత.

భారత్​లో సోమవారం 75 వేల 809 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 1133 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 42 లక్షల 80 వేల 423కి చేరింది. ఇప్పటివరకు 72 వేల 775 మంది కొవిడ్​కు బలయ్యారు.

ABOUT THE AUTHOR

...view details