తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ గాంధీపై మోదీ పరువు నష్టం దావా

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై పరువు నష్టం దావా వేశారు బిహార్​ ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్ మోదీ. 'దొంగలందరికి వారి పేరులో మోదీ ఉంటుంది ఎందుకు?' అన్న రాహుల్​ వ్యాఖ్యలపై సుశీల్​ కుమార్ కోర్టును ఆశ్రయించారు.

By

Published : Apr 19, 2019, 6:17 AM IST

Updated : Apr 19, 2019, 8:24 AM IST

రాహుల్​ గాంధీపై పరువు నష్టం దావా

'దొంగలందరి పేరులో మోదీ ఉంటుంది ఎందుకు?' అని రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించటంపై కోర్టును ఆశ్రయించారు బిహార్​ ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ. కాంగ్రెస్​ అధ్యక్షుడిపై పట్నా కోర్టులో పరువు నష్టం దావా వేశారు మోదీ.

పట్నా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ కుమార్​ గుజ్నన్​ ముందు ఐపీసీ సెక్షన్​ 500 ప్రకారం కేసు నమోదు చేశారు మోదీ. ఏప్రిల్​ 13న మహరాష్ట్రలో జరిగిన సభలో రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటుగా మోదీ పేరున్న వారి కీర్తిని దెబ్బతీసిందని తెలిపారు. ఈ విషయంపై ఫిర్యాదు స్వీకరించిన కోర్టు ఈ నెల 22 న విచారణ చేపట్టనుంది.

గత సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు రాహుల్​ గాంధీ. పరారీలో ఉన్న నీరవ్​ మోదీ, ఐపీఎల్​ మాజీ ఛైర్మన్​ లలిత్​ మోదీలను పేర్కొంటూ దొంగలందరి పేరులో మోదీ ఉంటుంది ఎందుకంటూ ప్రశ్నించారు రాహుల్. ఇంకెంత మంది మోదీలు బయటకు వస్తారో మనకు తెలియదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: "బడ్జెట్​లోనే రైతులకు కనీస మద్దతు ధర ప్రకటన"

Last Updated : Apr 19, 2019, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details