తెలంగాణ

telangana

'రాహుల్ వ్యక్తిగత హాజరు అవసరం లేదు'

By

Published : Apr 23, 2019, 8:34 PM IST

Updated : Apr 23, 2019, 10:47 PM IST

కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట లభించింది. విచారణకు వ్యక్తిగత హాజరు అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు 'చౌకీదార్​ చోర్​ హై' నినాదాన్ని ప్రచారంలో కొనసాగిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

రాహుల్ గాంధీ

రాహుల్​కు స్వల్ప ఊరట

కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. విచారణకు హాజరు కానక్కర్లేదంటూ సుప్రీంకోర్టు తాజా తాఖీదుల్లో పేర్కొంది.

ఈ పిటిషన్​పై ఏప్రిల్​ 30న విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

నినాదాన్ని కొనసాగిస్తాం: కాంగ్రెస్

'చౌకీదార్​ చోర్​ హై' వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఉద్దేశపూర్వకంగా ఆపాదించలేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. అయితే నినాదాన్ని భవిష్యత్తులోనూ ప్రచారంలో వాడతామని స్పష్టం చేసింది.

రఫేల్​పై తీర్పులో 'చౌకీదార్​ చోర్​ హై' అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని రాహుల్ పేర్కొన్నారు. ఈ విషయమై సుప్రీం తీర్పును వక్రీకరించి ధిక్కరణకు పాల్పడ్డారని భాజపా నేత మీనాక్షి లేఖి ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:రాహుల్​ 'దేశద్రోహం' కేసుపై 26న విచారణ

Last Updated : Apr 23, 2019, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details