తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌరసత్వంపై రాహుల్​కు హోంశాఖ నోటీసులు - నోటీసులు

పౌరసత్వం వివాదంలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీకి నోటీసులు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్​ స్వామి ఫిర్యాదు మేరకు రాహుల్​ను సమాధానం కోరింది. ఇందుకు 15 రోజులు గడువు ఇచ్చింది.

రాహుల్​కు నోటీసులు

By

Published : Apr 30, 2019, 11:14 AM IST

Updated : Apr 30, 2019, 12:58 PM IST

రాహుల్​కు కేంద్ర హోంశాఖ నోటీసులు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ పౌరసత్వంపై విమర్శలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్​ స్వామి ఫిర్యాదుపై స్పందించిన హోంశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది.

రాహుల్​గాంధీ బ్రిటన్​ దేశస్థుడంటూ ఇటీవల పలువురు నేతలు ఆరోపించారు. గతంలోనూ రాహుల్​ పౌరసత్వంపై ప్రశ్నించిన సుబ్రమణియన్​ హోంశాఖకు ఫిర్యాదు చేశారు.

లండన్​లో బ్యాకాప్స్​ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ల​లో రాహుల్​ ఒకరని, కార్యదర్శిగానూ ఉన్నారని పేర్కొన్నారు. ఆ సమయంలో కంపెనీ వార్షిక రిటర్నుల​ దాఖలులో రాహుల్​ బ్రిటీష్​ పౌరుడిగా పేర్కొన్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు స్వామి.

సుబ్రమణియన్​ స్వామి ఫిర్యాదుపై స్పందించిన హోం శాఖ రాహుల్​కు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది.
ఇటీవల అమేఠీలో రాహుల్​ నామినేషన్​ దాఖలు సమయంలోనూ.. ఆయన బ్రిటీష్​ పౌరుడని, ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు భాజపా నేతలు.

ఇదీ చూడండి:రాహుల్ గాంధీ​ పౌరసత్వంపై వివాదం..

Last Updated : Apr 30, 2019, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details