తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ సర్కారు ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది'

మోదీ ప్రభుత్వంపై రాహుల్​ గాంధీ మరోసారి విమర్శలు సంధించారు. పేద ప్రజల ప్రాథమిక హక్కులను మోదీ సర్కారు దోచుకుంటోందని ఆరోపించారు.

By

Published : Dec 10, 2020, 8:20 PM IST

rahul accuses modi govt of snatching fundamental rights of poor
'ప్రాథమిక హక్కులను మోదీ సర్కారు కాలరాస్తోంది'

పేద ప్రజల ప్రాథమిక హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం లాగేస్తోందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాహుల్.. ట్విట్టర్‌ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ చేసిన​ ట్వీట్​

"పేద ప్రజల ప్రాథమిక హక్కులను నరేంద్రమోదీ ప్రభుత్వం లాగివేస్తోంది. ఇది మానవత్వం పట్ల నేరం వంటిది. దేశ ఉత్తమమైన భవిష్యత్తు దృష్ట్యా ప్రతీ వర్గం హక్కులను కూడా గౌరవించాలి"

--రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత.

లాక్​డౌన్​లో​ పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఉన్న ఓ మీడియా కథనాన్ని రాహుల్​ తన ట్వీట్​కు జతచేశారు.

ఇదీ చూడండి:జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

ABOUT THE AUTHOR

...view details