తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'క్షమాపణ చెప్పాను... కేసు కొట్టేయండి'

కోర్టు ధిక్కరణ కేసును కొట్టేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కోర్టు తీర్పును తప్పుగా ఆపాదించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పానని స్పష్టం చేశారు.

By

Published : May 10, 2019, 9:10 PM IST

Updated : May 11, 2019, 12:04 AM IST

'క్షమాపణ చెప్పాను... కేసు కొట్టేయండి'

'క్షమాపణ చెప్పాను... కేసు కొట్టేయండి'

కోర్టు ధిక్కరణ కేసు నుంచి విముక్తి కల్పించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంను అభ్యర్థించారు. రఫేల్​పై కోర్టు తీర్పును ప్రధాని నరేంద్రమోదీకి తప్పుగా ఆపాదించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పానని న్యాయస్థానానికి తెలిపారు.

రఫేల్​ తీర్పులో 'కాపలాదారే దొంగ' అని సుప్రీంకోర్టే చెప్పిందని రాహుల్​ వ్యాఖ్యలపై భాజపా నేత మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్​ వేశారు. తీర్పును రాహుల్ వక్రీకరించారని అభిప్రాయపడిన కోర్టు.. ఏప్రిల్​ 23న నోటీసులు జారీ చేసింది.

మొదట రెండు సార్లు రాహుల్ దాఖలు చేసిన ప్రమాణ పత్రాలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పష్టమైన వివరణ ఇవ్వాలని మరో అవకాశం ఇచ్చింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో తప్పును అంగీకరించి బేషరతుగా క్షమాపణలు చెప్పారు రాహుల్​.

"కోర్టు తీర్పును వక్రీకరించినందుకు తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పాం. మొదటి ప్రమాణ పత్రంలోనూ ఇదే పేర్కొన్నాం. ఈ కేసును కొట్టివేయాలి."

-అభిషేక్ మనుసింఘ్వీ, రాహుల్ తరఫు న్యాయవాది

అయితే పిటిషనర్​, భాజపా ఎంపీ మీనాక్షి లేఖి ఈ అభ్యర్థనను వ్యతిరేకించారు.

"కోర్టు హెచ్చరికలతో క్షమాపణలు చెబుతూ మూడోసారి ప్రమాణపత్రం దాఖలు చేశారు రాహుల్. చాలా ఆలస్యంగా స్పందించారాయన. అందుకే ఈ క్షమాపణలను తిరస్కరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. "

-ముకుల్ రోహత్గీ, మీనాక్షి లేఖీ తరఫు న్యాయవాది

ఇదీ చూడండి: '2014 కాదు... అంతకుమించిన ప్రభంజనం'

Last Updated : May 11, 2019, 12:04 AM IST

ABOUT THE AUTHOR

...view details