అసోంలోని అరుదైన మరగుజ్జు పందుల(పిగ్మీ హగ్స్)పై లాక్డౌన్ విధించారు. ఎందుకో తెలుసా? పందుల్లో అత్యంత ప్రమాదకర అంటువ్యాధుల్లో ఒకటైన 'ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ' విస్తరింస్తుండటమే ఇందుకు కారణం.
ఈ పందులు 1960లోనే అంతరించిపోయాయని భావించారు. అయితే నిర్బంధ సంతానోత్పత్తి కార్యక్రమం, ఇతర పరిరక్షణ చర్యల ద్వారా వీటిని కాపాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ తీవ్రంగా విస్తరిస్తోంది. దీంతో వ్యాధి బారినపడి పెద్ద సంఖ్యలో పందులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పందులకు లాక్డౌన్ విధించి.. వాటి కోసం ఏర్పాటు చేసిన షెడ్ల్లోనే నిర్బంధించారు. ప్రస్తుతం అసోంలోని గువాహటి, నమేరి ప్రాంతాల్లోని సంతానోత్పత్తి కేంద్రాల్లో 82 పందులు, పంది పిల్లలు నివసిస్తున్నాయి.
ఎలా వ్యాపిస్తోంది?
'పందుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా, కలుషిత ఆహార పదార్థాలు తినడం వల్ల వైరస్ వ్యాపిస్తోంది. ఫలితంగా రక్తంలో అధిక స్థాయిలో వైరస్ ఉండటం వల్ల పందులు చనిపోతున్నాయి. మాంసంతోనూ ఈ వైరస్ విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా ఇతర జంతువులకూ వైరస్ సులభంగా సోకే అవకాశం ఉంది' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా నిబంధనలే దీనికి వర్తిస్తాయి!