పంజాబ్ మోగాలో ఓ హెడ్ కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్.. సొంత కుటుంబ సభ్యులనే కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. భార్య, అత్త, బావమరిది, బావమరిది భార్యను ప్రభుత్వ ఏకే-47తో దారుణంగా కాల్చి చంపాడు.
కొద్ది రోజుల క్రితం అత్తగారి భూమిలో ఓ పందుల ఫాం పెట్టి వ్యాపారం మొదలెట్టాడు కుల్విందర్. ఆ భూమిని అత్త, బావమరిది తిరిగి అడిగినందుకు తీవ్రంగా ఆగ్రహించిన కుల్విందర్ తప్ప తాగి అత్తారింటికి వెళ్లాడు. మద్యం మత్తులో బావమరిదితో గొడవకు దిగాడు. ఉద్రేకంలో తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపాడు.