తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2019, 12:49 PM IST

Updated : Jul 14, 2019, 1:17 PM IST

ETV Bharat / bharat

పంజాబ్: మంత్రి పదవికి​ సిద్ధూ రాజీనామా

నవ్​జోత్​ సింగ్ సిద్ధూ పంజాబ్​ మంత్రి పదవికి రాజీనామా చేశారు. జూన్​ 10న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడికి రాజీనామా లేఖ సమర్పించానని ట్విట్టర్​ వేదికగా తెలిపారు. మంత్రివర్గ మార్పే రాజీనామాకు కారణంగా తెలుస్తోంది.

సిద్ధూ రాజీనామా

మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు కాంగ్రెస్​ నేత నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ ప్రకటించారు. ఈ మేరకు జూన్​ 10న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించానని తెలిపారు. నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా బహిర్గతం చేశారు సిద్ధూ. పంజాబ్​ ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​కు కూడా లేఖను పంపిస్తున్నానని స్పష్టం చేశారు.

రాజీనామా పత్రం

శాఖ మార్పే కారణం!

పంజాబ్​ మంత్రివర్గంలో పర్యటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ అమాత్యులుగా పని చేశారు సిద్ధూ. జూన్​ 6న మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేశారు అమరిందర్​. పర్యటకానికి బదులుగా విద్యుత్​ శాఖను సిద్ధూకు కేటాయించారు. దీనిపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికే అమరిందర్​తో సిద్ధూకు విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన శాఖ బాధ్యతలను సిద్ధూ స్వీకరించలేదు. జూన్​ 8న సీఎం సలహా బృందం నుంచీ వైదొలిగారు.

అధినాయకత్వంతో భేటీ

ఈ పరిణామాల నేపథ్యంలో జూన్​ 9న రాహుల్​ గాంధీతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ను కలిసినట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఆ సమయంలోనే లేఖ సమర్పించానని తెలిపిన సిద్ధూ అప్పుడు రాజీనామాపై స్పష్టత ఇవ్వలేదు.

కాంగ్రెస్ నేతలతో భేటీ

ఇదీ చూడండి: కర్ణాటకీయం: కూటమికి ఝలక్- ముంబయికి నాగరాజు

Last Updated : Jul 14, 2019, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details