దేశంలో తొలిసారి వర్టికల్ ట్రాన్స్మిషన్ కరోనా కేసు మహారాష్ట్ర పుణెలో నమోదైంది. తల్లి నుంచి నవజాత శిశువుకు కరోనా వైరస్ సోకినట్లు ససూన్ జనరల్ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు.
తల్లికి నెగెటివ్ కానీ..
దేశంలో తొలిసారి వర్టికల్ ట్రాన్స్మిషన్ కరోనా కేసు మహారాష్ట్ర పుణెలో నమోదైంది. తల్లి నుంచి నవజాత శిశువుకు కరోనా వైరస్ సోకినట్లు ససూన్ జనరల్ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు.
తల్లికి నెగెటివ్ కానీ..
తల్లికి మొదట నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో కరోనా నెగెటివ్గా తేలినట్లు ససూన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. యాంటీ బాడీ పరీక్షలు చేయగా..తల్లిలో కరోనా ఆనవాళ్లు లభించినట్లు వెల్లడించాయి. దీనితో ఆమెకు కరోనా సోకినా.. యాంటీ బాడీలు వైరస్ను ఎదుర్కొని ఉండొచ్చనే అంచనాకు వచ్చారు వైద్యులు.
వెంటనే నవజాత శిశువు బొడ్డుతాడు, ఇతర అవయవాల నుంచి సేకరించిన శాంపిల్స్కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలినట్లు వైద్యులు చెప్పారు. శిశువులో తీవ్ర అనారోగ్య సమస్యలు గుర్తించి.. 3 వారాల పాటు ఐసీయూలో చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్లేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇదీ చూడండి:ఆ ప్రాంతాల్లో ఆగస్టు 31 వరకు లాక్డౌన్