తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామా సూత్రధారి మృతి - ముదసిర్​ అహ్మద్​ ఖాన్​

దక్షిణ కశ్మీర్​లోని ట్రాల్​ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి ముదసిర్​ అహ్మద్​ ఖాన్​ మరణించినట్లు అధికారులు ప్రకటించారు. తాజాగా జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు.

పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి ముదసిర్​ అహ్మద్​ ఖాన్​ మృతి

By

Published : Mar 11, 2019, 2:04 PM IST

Updated : Mar 11, 2019, 5:17 PM IST

పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు మృతి చెందారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి హతమైనట్లు అధికారులు భావిస్తున్నారు. దక్షిణ కశ్మీర్​లోని ట్రాల్​ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి.

ట్రాల్​ ఎన్​కౌంటర్​లో మరణించిన ముగ్గురిలో జైషే మహ్మద్​ (జెమ్​) తీవ్రవాది ముదసిర్​ అహ్మద్​ ఖాన్​ అలియాస్​ 'మోహ్ద్​ భాయ్​' ఉన్నాడని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన ముష్కరులను గుర్తించేందకు ప్రయత్నిస్తున్నారు.

ట్రాల్​లోని పింగ్లిష్​ ప్రాంతంలో ఉగ్రమూకలు ఉన్నాయన్న నిఘా సంస్థల పక్కా సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. జవాన్లపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన జవాన్లు కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు.

ఇదీ చూడండీ:కశ్మీర్​లో కాల్పులు​...ముగ్గురు తీవ్రవాదులు హతం

Last Updated : Mar 11, 2019, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details