పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి హతమైనట్లు అధికారులు భావిస్తున్నారు. దక్షిణ కశ్మీర్లోని ట్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి.
ట్రాల్ ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురిలో జైషే మహ్మద్ (జెమ్) తీవ్రవాది ముదసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ 'మోహ్ద్ భాయ్' ఉన్నాడని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన ముష్కరులను గుర్తించేందకు ప్రయత్నిస్తున్నారు.