తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"అమర జవాన్లకు నివాళిగా హోలీ రద్దు"

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా ఈ ఏడాది హోలీ వేడుకలు నిర్వహించొద్దని సీఆర్​పీఎఫ్​ నిర్ణయించింది.

By

Published : Mar 20, 2019, 9:21 AM IST

Updated : Mar 20, 2019, 1:03 PM IST

డైరెక్టర్​ జనరల్​ ఆర్​ఆర్​ భట్నాగర్​

పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది అమర సైనికులకు నివాళిగా ఈ ఏడాది హోలీ వేడుకలను రద్దు చేసింది సీఆర్​పీఎఫ్​. వేడుకలను అధికారికంగా నిర్వహించబోమని డైరెక్టర్​ జనరల్​ ఆర్​ఆర్​ భట్నాగర్​ తెలిపారు.

సీఆర్​పీఎఫ్ డైరెక్టర్​ జనరల్​ ఆర్​ఆర్​ భట్నాగర్

"సీఆర్​పీఎఫ్​ 80వ వార్షికోత్సవం సందర్భంగా 3 లక్షల మంది సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో సమర్థంగా, ధైర్యంగా మా విధులను నిర్వర్తిస్తామన్న నమ్మకం ఉంది. వీరమరణం పొందిన వారికి నివాళిగా హోలీ నిర్వహించొద్దని నిర్ణయాన్ని తీసుకున్నాం."- ఆర్​ ఆర్​ భట్నాగర్​, సీఆర్​పీఎఫ్​ డీజీ

సీఆర్​పీఎఫ్​ 80వ వార్షికోత్సవ పరేడ్​నుమంగళవారంగుడ్​గావ్​​లో నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు డీజీ. వారి కుటుంబాలకు సహకరించేందుకు మొబైల్​ యాప్​ రూపొందిస్తున్నట్టు తెలిపారు.

దేశంలో నక్సళ్ల ప్రభావం 40 శాతం తగ్గినట్లు డీజీ భట్నాగర్​ వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లోనే వారి ప్రభావం ఉందని స్పష్టం చేశారు.

Last Updated : Mar 20, 2019, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details