తెలంగాణ

telangana

నిరసనలు ఆకస్మికం కాదు.. విపక్షాల ప్రయోగం: మోదీ

By

Published : Feb 3, 2020, 6:39 PM IST

Updated : Feb 29, 2020, 1:06 AM IST

షహీన్​బాగ్​ నిరసనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు ప్రధాని మోదీ. ఈ నిరసనలు అకస్మాత్తుగా జరిగినవి కాదని... వీటి వెనుక విపక్షాల జోక్యం ఉందని దిల్లీలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమం వేదికగా విమర్శించారు.

Protests in Seelampur, Shaheen Bagh and Jamia over CAA are no coincidence but an experiment: PM Modi
నిరసనలు ఆకస్మికం కాదు.. విపక్షాల ప్రయోగం: మోదీ

నిరసనలు ఆకస్మికం కాదు.. విపక్షాల ప్రయోగం: మోదీ

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ.. ఈ ఆందోళనలు తగ్గకపోవడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. దిల్లీలోని కడ్​కడ్​డుమా​లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ.. నిజమైన కుట్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కొందరు రాజ్యాంగం- త్రివర్ణ జెండాను అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు.

"సీలంపుర్​, జామియా, షహీన్​బాగ్​... గత కొన్ని రోజులుగా పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు అకస్మాత్తుగా జరిగినవా? కాదు.. ఇవి యాదృచ్ఛికం కాదు.. ఇవి విపక్షాల ప్రయోగాలు. దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. దేశ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే వారి నైజం. వీరు చట్టవ్యతిరేకులు కాకపోయుంటే.. ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పుడే ఈ నిరసనలు ఆగిపోయుండాల్సింది. కానీ ఆమ్​ ఆద్మీ-కాంగ్రెస్​ రాజకీయ కుట్రకు పాల్పడుతున్నాయి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం మెరుపుదాడులు జరపడం వల్ల దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటే.. కేజ్రీవాల్ మాత్రం​ ఆర్మీపై ప్రశ్నల వర్షం కురిపించారని మోదీ మండిపడ్డారు.

దిల్లీలోని అనధికారిక నివాసాల్లో జీవిస్తున్న ప్రజలకు తమ ప్రభుత్వం విముక్తినిచ్చిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆప్​ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూనే.. భాజపా తెచ్చిన అభివృద్ధి పథకాలను వివరించారు.

Last Updated : Feb 29, 2020, 1:06 AM IST

ABOUT THE AUTHOR

...view details