తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2019, 2:04 PM IST

Updated : Dec 15, 2019, 3:20 PM IST

ETV Bharat / bharat

'పౌర'సెగ: బంగాల్​లో ఆందోళనలు మరింత ఉద్ధృతం

పశ్చిమ్​ బంగాలో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. బిర్భుమ్​, ఉత్తర 24 పరగణాల జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులను నిర్బంధించారు నిరసనకారులు. టైర్లు, దుంగలు కాల్చుతూ రవాణాకు అంతరాయం కలిగించారు. కేరళ త్రివేండ్రం రైల్వే స్టేషన్​ ఎదుట ఆందోళనకు దిగింది కాంగ్రెస్​.

Protests against Citizenship law continue in Bengal
'పౌర'సెగ: బంగాల్​లో ఆందోళనలు మరింత ఉద్ధృతం

'పౌర'సెగ: బంగాల్​లో ఆందోళనలు మరింత ఉద్ధృతం

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా పశ్చిమ బంగాలో చెలరేగిన నిరసనలు వరుసగా మూడోరోజు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకి చేరి నిరసనలు చేపట్టారు. నదియా, బిర్భుమ్​, ఉత్తర 24 పరగణాలు, హౌరా జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉత్తర 24 పరగణాల​ జిల్లాలోని అమదంగా, కల్యాణి ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపై టైర్లు, దుంగలు కాల్చి.. రవాణాకు అంతరాయం కలిగించారు. వ్యాపార సముదాయాలను మూసివేశారు. నదియాలో కల్యాణి ఎక్స్​ప్రెస్​ హైవేను నిర్భందించారు.

బలగాల మోహరింపు..

ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో బలగాలను తరలించారు అధికారులు. నిరసనకారులను చెదరగొట్టేందుకు చర్యలు చేపట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషనల్లో భద్రత పెంచింది రైల్వే శాఖ. ఆర్​పీఎఫ్​ సిబ్బందితో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు.

రాష్ట్రంలో అమలు చేయం..

పౌరసత్వ చట్ట సవరణను రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పారు తృణమూల్​ కాంగ్రెస్​ నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ. ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు.

కేరళలో కాంగ్రెస్​ ఆందోళనలు..

పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ త్రివేండ్రంలో ఆందోళన చేపట్టింది కాంగ్రెస్​. త్రివేండ్రం రైల్వే స్టేషన్​ ఎదుట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకొని నిరసనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ఈశాన్యాన 'పౌర' సెగ- పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి

Last Updated : Dec 15, 2019, 3:20 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details