ఈశాన్య రాష్ట్రాలు, బంగాల్లో పౌరసత్వ చట్ట సవరణపై ఆందోళనలు శనివారమూ కొనసాగాయి. నాగాలాండ్లో నిరసనకారులు ఆరుగంటల పాటు బంద్ చేపట్టారు. అసోం సోనిత్పుర్ జిల్లా దెకియాజులిలో ముగ్గురు గుర్తుతెలియని ఆందోళనకారులు చమురు ట్యాంకుకు నిప్పంటించారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. బంగాల్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అనేక చోట్ల ఆందోళనలు నిర్వహించారు.
బంగాల్లో హింసాత్మకం
వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా బంగాల్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. హావ్డా జిల్లాలోని సంక్రియాల్ స్టేషన్కు నిరసనకారులు నిప్పంటించారు. భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు. హావ్డా, సెల్డా స్టేషన్ల మీదగా నడవాల్సిన రైళ్లు నిలిచిపోయాయి. 'పౌర' చట్టానికి వ్యతిరేకంగా వందలమంది రహదారులను దిగ్బంధించారు. ఫలితంగా వాహన రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది.
ఆందోళనలు శాంతియుతంగా నిర్వహించాలని, హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
అసోంలో విద్యార్థుల నేతృత్వంలో
అసోం విదార్థి సమాఖ్య(ఆసు), అసోం జాతీయతావాది యువఛత్ర పరిషత్ సహా మరో 30 సంస్థల నేతృత్వంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజూ సాయంత్రం 5 గంటలవరకు నిరసనలు చేపడతామని ఆసు విద్యార్థి నేతలు వెల్లడించారు.
హింసాయుత నిరసనల దృష్ట్యా అసోంలో డిసెంబర్ 16 వరకు అంతర్జాల సేవలు నిలిపి ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.
నాగాలాండ్లో ఆరుగంటల పాటు..