తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తూర్పు, ఈశాన్య భారతంలో మిన్నంటిన 'పౌర' ఆగ్రహం - Several countriesexercise caution while travelling to the Northeast India

పౌరసత్వ చట్ట సవరణపై ఈశాన్య రాష్ట్రాలు, బంగాల్​ పౌరుల్లో ఆగ్రహం మిన్నంటుతోంది. పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రహదారులను దిగ్బంధించారు. అసోంలో ఓ ఇంధన ట్యాంకర్​ను తగలబెట్టిన ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈశాన్య భారతంలో పర్యటించే సమయంలో జాగ్రత్త వహించాలని అమెరికా, బ్రిటన్ సహా వివిధ దేశాలు తమ పౌరులను హెచ్చరించాయి.

north east
తూర్పు, ఈశాన్య భారతంలో మిన్నంటిన 'పౌర' ఆగ్రహం

By

Published : Dec 14, 2019, 7:05 PM IST

Updated : Dec 14, 2019, 10:12 PM IST

తూర్పు, ఈశాన్య భారతంలో మిన్నంటిన 'పౌర' ఆగ్రహం

ఈశాన్య రాష్ట్రాలు, బంగాల్​లో పౌరసత్వ చట్ట సవరణపై ఆందోళనలు శనివారమూ కొనసాగాయి. నాగాలాండ్​లో నిరసనకారులు ఆరుగంటల పాటు బంద్ చేపట్టారు. అసోం సోనిత్​పుర్ జిల్లా దెకియాజులిలో ముగ్గురు గుర్తుతెలియని ఆందోళనకారులు చమురు ట్యాంకుకు నిప్పంటించారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. బంగాల్​లో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అనేక చోట్ల ఆందోళనలు నిర్వహించారు.

బంగాల్​లో హింసాత్మకం

వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా బంగాల్​లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. హావ్​డా జిల్లాలోని సంక్రియాల్​ స్టేషన్​కు నిరసనకారులు నిప్పంటించారు. భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు. హావ్​డా, సెల్డా స్టేషన్ల మీదగా నడవాల్సిన రైళ్లు నిలిచిపోయాయి. 'పౌర' చట్టానికి వ్యతిరేకంగా వందలమంది రహదారులను దిగ్బంధించారు. ఫలితంగా వాహన రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది.

ఆందోళనలు శాంతియుతంగా నిర్వహించాలని, హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

అసోంలో విద్యార్థుల నేతృత్వంలో

అసోం విదార్థి సమాఖ్య(ఆసు), అసోం జాతీయతావాది యువఛత్ర పరిషత్ సహా మరో 30 సంస్థల నేతృత్వంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజూ సాయంత్రం 5 గంటలవరకు నిరసనలు చేపడతామని ఆసు విద్యార్థి నేతలు వెల్లడించారు.

హింసాయుత నిరసనల దృష్ట్యా అసోంలో డిసెంబర్ 16 వరకు అంతర్జాల సేవలు నిలిపి ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.

నాగాలాండ్​లో ఆరుగంటల పాటు..

నాగాలాండ్ రాష్ట్రంలో ఆరుగంటల పాటు బంద్ పాటించారు. విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు మూతపడ్డాయి.

ఆంక్షలు సడలింపు

'పౌర'వ్యతిరేక ఆందోళనలకు ప్రధానకేంద్రంగా మారిన అసోం గువాహటి సహా దిబ్రూగఢ్​లలో కొన్ని గంటలపాటు నిరవధిక కర్ఫ్యూ నిబంధనలను సడలించారు. మేఘాలయ రాష్ట్రంలోనూ ఆంక్షల నిబంధనలను కొద్ది గంటలపాటు ఎత్తేశారు.

బిహార్​లో 21న బంద్

బిహార్​లో డిసెంబర్ 21న పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తామని లాలు ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్​జేడీ ప్రకటించింది.

'ఈశాన్యానికి వెళ్తే జాగ్రత్త'

ఈశాన్య భారతంలోని పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్, కెనడా, సింగపుర్ సహా వివిధ దేశాల ప్రభుత్వాలు వారి పౌరులను హెచ్చరించాయి. ఆయా ప్రాంతాల్లో పర్యటించే సమయంలో జాగ్రత్త వహించాలని సూచించాయి.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి సోదరుడు కిడ్నాప్​- డిమాండ్లు​ ఇవే...

Last Updated : Dec 14, 2019, 10:12 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details