తెలంగాణ

telangana

By

Published : May 16, 2019, 8:38 PM IST

ETV Bharat / bharat

బోఫోర్స్ దర్యాప్తు కొనసాగుతుంది: సీబీఐ

రాజకీయంగా అత్యంత సున్నితమైన బోఫోర్స్​ కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగుతుందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పష్టం చేసింది.

CBI-BOFORS

బోఫోర్స్ కుంభకోణం కేసు దర్యాప్తు కొనసాగుతుందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పష్టం చేసింది. ఈ కేసులో లోతుగా విచారణ చేయడానికి అనుమతి కోరుతూ దిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ దరఖాస్తు చేసి, అనంతరం ఉపసంహరించుకుంది. ఈ విషయంపై స్పష్టతనిచ్చింది సీబీఐ.

"బోఫోర్స్​ కుంభకోణానికి సంబంధించి, నిందితుడు మైఖేల్​ హర్ష్​మన్​ కొన్ని వివరాలు వెల్లడించిన దృష్ట్యా, మరింత లోతుగా విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది."-నితిన్​ వాకంకర్​, సీబీఐ అధికార ప్రతినిధి

ఈ కేసుపై స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టడానికి సీబీఐకి హక్కులు, అధికారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసిందని నితిన్ తెలిపారు. ఇకపైనా ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు.

"చట్టపరమైన అభిప్రాయాలను పొందిన తరువాత, దిల్లీ చీఫ్​ మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​ కోర్టుకు 2019 మే 16న సీబీఐ దరఖాస్తు చేసుకుంది. అందులో సీఆర్​పీసీ సెక్షన్ 173(8) ప్రకారం బోఫోర్స్​ కుంభకోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ కోరింది.​ నిజానికి సీబీఐకి న్యాయస్థానం అనుమతి అవసరం లేదు. విషయాన్ని కోర్టుకు నివేదిస్తే సరిపోతుంది."-నితిన్​ వాకంకర్​, సీబీఐ అధికార ప్రతినిధి

ఇదీ కేసు....

స్వీడిష్​ ఆర్టిలరీ తుపాకుల కొనుగోలు ఒప్పందంలో రూ.64 కోట్లు ముడుపులు చేతులు మారాయన్నదే బోఫోర్స్​ కుంభకోణం కేసు.

ఇదీ చూడండి: 'మోదీలై': ప్రధానిపై రాహుల్​ కొత్త పంచ్​లు

ABOUT THE AUTHOR

...view details