నూతన సంవత్సరంలో భారత్కు కొవిడ్-19 టీకా అందనుందని సూత్రప్రాయంగా తెలిపారు భారత ఔషధ నియంత్రణాధికారి వీజీ సోమని. ఓ వెబినార్లో ఈ మేరకు కొత్త ఏడాదిలో శుభవార్త అందనుందని వెల్లడించారు. విపత్కర సమయంలో ఔషధ పరిశ్రమ, పరిశోధన సంస్థలు కీలక భూమిక పోషించాయన్నారు.
" బహూశా.. చేతిలో ఏదో దానితో చాలా సంతోషకరమైన నూతన ఏడాది ఉంటుంది. నేను చెప్పగలిగేది అదే. కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం పూర్తి సమాచారం కోసం వేచిచూడకుండా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా సాగుతోంది. పలు టీకాల ఫేజ్ 1, 2 పరీక్షలను ఒకేసారి నిర్వహించేందుకు అనుమతించాం. అయితే.. టీకా భద్రత, సమర్థతపై ఎలాంటి రాజీ ఉండబోదు."
- వీజీ సోమని, డ్రగ్ కంట్రోల్ జనరల్