తెలంగాణ

telangana

By

Published : May 9, 2019, 9:45 AM IST

ETV Bharat / bharat

'ప్రియాంకను చూస్తే ఇందిర గుర్తొచ్చారు'

వరుస రోడ్​షోలు, ప్రచారాలతో దిల్లీలో బుధవారం రోజంతా పర్యటించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఆమె మాట తీరు, హావభావాలు, ముఖకవళికలు చూసిన దిల్లీవాసులు కొందరు తమకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గుర్తొచ్చారని మురిసిపోతున్నారు.

'ప్రియాంకను చూస్తే ఇందిరా గాంధీ గుర్తొచ్చారు'

దక్షిణ దిల్లీలో జరిగిన కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రోడ్​షోను చూశారు ఊర్మిళ, మున్ని అనే మహిళలు. ఆమెను చూస్తే మాజీ ప్రధాని ఇందిరా గాంధీయే జ్ఞప్తికి వస్తున్నారని అభిప్రాయపడ్డారు.

" ప్రియాంక చూడడానికి అచ్చం ఇందిరా గాంధీలానే ఉన్నారు. ఆమె కేశాలంకరణ, ఆమె ముఖం ఇందిరను తలపిస్తున్నాయి." -- ఊర్మిళ, దక్షిణ దిల్లీ వాసి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఎన్నికల ర్యాలీల్లో చూశామని వారిద్దరూ చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీ పునరుజ్జీవంలో ప్రియాంక కీలకపాత్ర పోషిస్తారని వారు ఆకాంక్షించారు.

'ప్రియాంకను చూస్తే ఇందిరా గాంధీ గుర్తొచ్చారు'

" నేను ఇందిరా గాంధీని అప్పట్లో అలీగఢ్​ ర్యాలీలో చూశా. ఇప్పుడేమో భాజపా నేతలు నెహ్రూతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై మాటల దాడి చేస్తున్నారు. ఏం చేసినా ఆ కుటుంబంపై మా అభిమానం పెరుగుతూనే ఉంటుంది" -- మున్ని, స్థానికురాలు

దక్షిణ దిల్లీలో కాంగ్రెస్​ అభ్యర్థి విజేందర్​ సింగ్​ తరఫున బుధవారం ప్రచారం నిర్వహించారు ప్రియాంక గాంధీ. దాదాపు గంట పాటు ఆ ప్రాంతంలో రోడ్​షో నిర్వహించారు. ఇదీ చూడండి: టికెట్​ రద్దు చేసిన రెండేళ్లకు రూ.33 రీఫండ్

ABOUT THE AUTHOR

...view details