తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ర్యాలీ మృతుడి సంతాప సభకు ప్రియాంక - Priyanka Gandhi latest news

జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీలో మరణించిన నవ్రీత్ సింగ్ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. నవ్రీత్​ సంతాప సభకు వెళ్తుండగా ఆమె కాన్వాయ్​ ప్రమాదానికి గురైంది.

Priyanka Gandhi meets family of deceased farmer in Rampur
ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక

By

Published : Feb 4, 2021, 4:53 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా జనవరి 26న జరిగిన ట్రాక్టర్​ ర్యాలీలో మరణించిన నవ్రీత్​ సింగ్​ కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఉత్తర్​ప్రదేశ్​ రాంపుర్​ జిల్లా దిబ్​దిబా గ్రామంలో అతని కుటుంబం ఏర్పాటు చేసిన సంతాప సభకు హాజరయ్యారు. నవ్రీత్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రియాంక.

మృతి చెందిన రైతు కుటుంబాన్ని కలిసిన ప్రియాంక
సంతాప సభలో పాల్గొన్న ప్రియాంక

ప్రియాంకతో పాటు కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్​ లల్లు, పలువురు పార్టీ సీనియర్​ నేతలు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

భాజపా నేత కారును ఢీకొన్న ప్రియాంక కాన్వాయ్​

అంతకుముందు.. ప్రియాంక వాహనశ్రేణి ఉత్తర్​ప్రదేశ్​లో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. రాంపుర్​ వెళ్తుండగా ప్రియాంక కాన్వాయ్​.. జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు వీరేందర్​ చౌదరి కారును ఢీకొట్టింది. వెంటనే కాన్వాయ్​లోని నాలుగు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కారు అద్దాన్ని తుడిచిన ప్రియాంక

ప్రమాదం తర్వాత.. మంచు కారణంగా దారి సరిగా కనిపించడం లేదని డ్రైవర్​ కారు ఆపగా... ప్రియాంక కారు దిగి వస్త్రంతో అద్దాన్ని తుడిచారు.

ఇదీ చూడండి:బాలికపై హత్యాచారం- అడ్డొచ్చిన ఇద్దరు హత్య

ABOUT THE AUTHOR

...view details