తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా వలయంలో సెక్యూరిటీల కుటుంబాలు విలవిల' - security job effect with corona

కరోనా కారణంగా అనేక మంది సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలకు భద్రత లేదని.. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరింది సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ. ఈ మేరకు మోదీకి లేఖ రాసింది.

Private security industry body writes to PM seeking help to save jobs
'ఉద్యోగ భద్రతలో మోదీ జోక్యం చేసుకోవాలి'

By

Published : Mar 21, 2020, 9:25 PM IST

కరోనా భయంతో అనేక కార్పొరేట్​, ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు 'వర్క్​ ఫ్రమ్​ హోం' అవకాశం కల్పించాయి.. కొన్ని సంస్థలు సెలవులను ప్రకటించాయి. ఈ ప్రభావం సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలపైనా పడింది. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్​ సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోకుండా మోదీ జోక్యం చేసుకోవాలని సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (సీఏపీఎస్​ఐ) చైర్మన్ కె.విక్రమ్ సింగ్ లేఖ రాశారు.

సుమారు 85 లక్షలకు పైగా శ్రామిక శక్తి, 22 శాతం వార్షిక వృద్ధి రేటుతో దేశంలోనే భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన ఉన్న రంగాల్లో ప్రైవేటు సెక్యూరిటీ ఇండస్ట్రీ ఒకటి. వైరస్​ కారణంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులు ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు విక్రమ్​.

జీవనోపాధి సంగతేంటి?

వైరస్​ వాప్తి కారణంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మాల్స్​, హోటళ్లు, థియేటర్లు తాత్కాలికంగా మూసేశారు. ఇందులో చాలామంది సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం ఒక సెక్యూరిటీ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి చాలా సంస్థలు. అయితే మిగతా సిబ్బంది జీవనోపాధి సంగతేంటని విక్రమ్​ ప్రశ్నించారు. ఈ పరిస్థితులు వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని వివరించారు.

లక్షలాది మంది ప్రైవేట్​ సెక్యూరిటీ సిబ్బంది, 23వేల మంది యజమానులను ఈ అనిశ్చితి నుంచి కాపాడాలని మోదీని కోరారు.

ABOUT THE AUTHOR

...view details