తెలంగాణ

telangana

By

Published : Dec 12, 2020, 5:31 AM IST

Updated : Dec 12, 2020, 6:12 AM IST

ETV Bharat / bharat

ప్రపంచ వాతావరణ సదస్సులో నేడు మోదీ ప్రసంగం

పారిస్​ వాతావరణ ఒప్పందానికి ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు జరగనున్న ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొంటారు. వాతావరణ మార్పులు, లక్ష్యాలపై మోదీ ప్రసంగిస్తారు.

Modi
ప్రపంచ వాతావరణ సదస్సులో మోదీ ప్రసంగం

ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రసంగించనున్నారు. పారిస్​ వాతావరణ ఒప్పందానికి నేటితో ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో వర్చువల్​గా ఈ సదస్సు జరగనుంది. ఈ మేరకు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ తెలిపారు.

"వాతావరణ మార్పు ఈ రోజు జరిగింది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి క్రమంగా ఈ మార్పు వస్తోంది. ప్రపంచ ఉద్గారాల్లో అమెరికా 25 శాతం, ఐరోపా 22 శాతం, చైనా 13 శాతంతో పోలిస్తే భారత్​ కేవలం 3 శాతంతో ఎంతో బాధ్యాతాయుతంగా నడుచుకుంటోంది. భారత్..​ పారిస్​ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడమే కాదు.. అంతకుమించి చేస్తోంది.

- ప్రకాశ్​ జావడేకర్​, పర్యావరణ శాఖ మంత్రి

ప్రారంభ ఉపన్యాసం..

ఫెడరేషన్​ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (ఎఫ్​ఐసీసీఐ) 93వ వార్షిక సర్వసభ్య సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మోదీ ప్రారంభ ఉపన్యాసం ఇవ్వనున్నారు.

Last Updated : Dec 12, 2020, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details