తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈటీవీ భారత్​ "వైష్ణవ జన తో" గీతానికి ప్రధాని అభినందనలు - వైష్ణవ జనతో గీతం ట్విట్ట్రర్​ వేదికగా పంచుకున్న మోదీ

ఈటీవీ భారత్​ "వైష్ణవ జన తో" గీతావిష్కరణపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఈటీవీ భారత్​ చేసిన ప్రయత్నాన్ని కొనియాడుతూ ట్వీట్​ చేశారు.

ఈటీవీ భారత్​ "వైష్ణవ జన తో" గీతానికి ప్రధాని అభినందనలు

By

Published : Oct 2, 2019, 7:11 PM IST

Updated : Oct 2, 2019, 10:12 PM IST

మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్​ ఆవిష్కరించిన 'వైష్ణవ జన తో' గీతంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఈటీవీ భారత్​ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ ట్వీట్​ చేశారు. బాపూజీ కలల సాకారానికి అనుగుణంగా... స్వచ్ఛ భారత్​ అభియాన్​ ప్రచారంలో మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోందని ట్వీట్​ చేశారు.

"పూజ్యులైన బాపూను స్మరిస్తూ అద్భుతమైన భజన గీతాన్ని స్తుతించినందుకు ఈటీవీ భారత్​కు హార్దిక అభినందనలు. గాంధీ కలలు సాకారం అవ్వడానికి, స్వచ్ఛభారత నిర్మాణానికి మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి భారత్​కు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది."

-నరేంద్ర మోదీ, ప్రధాని

ఈటీవీ భారత్​ రూపొందించిన వైష్ణవ జనతో భజన గీతం యావత్​ దేశాన్ని ఆకట్టుకుంటోంది. ఉపరాష్ట్రపతి, రైల్వే మంత్రి ప్రశంసల అనంతరం.. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈటీవీ భారత్​ ప్రయత్నాన్ని కొనియాడడం విశేషం.

ఇదీ చూడండి:ఔరా: ఆ ఇటుక గోడల వయసు 2,600 ఏళ్లు..!

Last Updated : Oct 2, 2019, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details