తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ చేరుకున్న ప్రధాని మోదీ

జాపాన్​ జీ-20 సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... తిరిగి స్వదేశం చేరుకున్నారు. మూడు రోజుల ఈ పర్యటనలో ఆయన వివిధ దేశాధినేతలతో పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు.

By

Published : Jun 29, 2019, 9:00 PM IST

Updated : Jun 29, 2019, 10:26 PM IST

భారత్​ చేరుకున్న ప్రధాని మోదీ

భారత్​ చేరుకున్న ప్రధాని మోదీ

జపాన్​ వేదికగా జరిగిన జీ-20 సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భారత్ చేరుకున్నారు. మూడు రోజుల ఈ పర్యటనలో భాగంగా వివిధ దేశాధినేతలతో పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు.

జీ-20 సదస్సులో...

జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ... యోగా, ఆయుష్మాన్ భారత్​ గురించి సభ్యదేశాలకు వివరించారు. మహిళా సాధికారత, లింగ సమానత్వం ఆవశ్యకతను తెలియజేశారు.

వాతావరణ మార్పులు, స్వచ్ఛ ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, పర్యాటకం, పేదలకు క్రమంగా సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే అంశాలను సదస్సులో ప్రస్తావించారు మోదీ.

ఇదీ చూడండి: మహారాష్ట్రను వణికిస్తున్న భారీ వర్షాలు

Last Updated : Jun 29, 2019, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details