తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికాలో నరేంద్ర మోదీ సభకు 70వేల మంది!

ప్రధాని నరేంద్ర మోదీ ఐరాస సమావేశంలో పాల్గొనేందుకు సెప్టెంబర్​లో అమెరికా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హ్యూస్టన్​లో ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

By

Published : Jul 13, 2019, 10:13 AM IST

అమెరికాలో నరేంద్ర మోదీ సభకు 70వేల మంది!

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్​లో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా చికాగో, హ్యూస్టన్​లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

ప్రధాని మోదీ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా... ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు ప్రవాస భారతీయ సంఘాలు తెలిపాయి.

భారతీయ అమెరికన్​ ప్రజల్లో అత్యధిక శాతం హ్యూస్టన్​లోనే ఉంటున్నారు. అందువల్ల ఆ ప్రాంతాన్ని సందర్శించాలని మోదీ భావిస్తున్నారు. పర్యటనలో భాగంగా సెప్టెంబర్​ 22న హ్యూస్టన్​లో ప్రవాస భారతీయులతో ప్రధాని సమావేశమవుతారు. సెప్టెంబర్​ 23న ఐరాసలో వాతావరణ మార్పులపై జరిగే ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

ప్రవాస భారతీయులతో..

2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు భారత-అమెరికన్ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించడం ఇది మూడో సారి.​ ఇంతకుముందు 2014లో న్యూయార్క్​లోని మాడిసన్​ స్క్వేర్ గార్డెన్​లో, 2016లో సిలికాన్​ వ్యాలీలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అపుడు మోదీ ప్రసంగాలు వినడానికి సుమారు 20 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు.

ప్రతిపాదిత హ్యూస్టన్ కార్యక్రమం నిర్వహించడానికి 70 వేల మంది కూర్చొనే సామర్థ్యం కలిగిన బహుళార్థ సాధక 'ఎన్ఆర్​జీ' స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ మరోసారి..

ABOUT THE AUTHOR

...view details