ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్లో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా చికాగో, హ్యూస్టన్లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
ప్రధాని మోదీ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా... ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు ప్రవాస భారతీయ సంఘాలు తెలిపాయి.
భారతీయ అమెరికన్ ప్రజల్లో అత్యధిక శాతం హ్యూస్టన్లోనే ఉంటున్నారు. అందువల్ల ఆ ప్రాంతాన్ని సందర్శించాలని మోదీ భావిస్తున్నారు. పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 22న హ్యూస్టన్లో ప్రవాస భారతీయులతో ప్రధాని సమావేశమవుతారు. సెప్టెంబర్ 23న ఐరాసలో వాతావరణ మార్పులపై జరిగే ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.