దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ అమల్లో ఉన్న వేళ ఎంతో సమర్థవంతంగా వ్యవహరిస్తూ విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు.
"కరోనాపై నిరంతరం పోరాటం కొనసాగిస్తే తప్పక విజయం సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. ఈ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, వారి కుటుంబాలకు ప్రమాదం ఉన్నప్పటికీ వైరస్పై పోరాడుతున్న వారందరికీ కృతజ్ఞతలు. పోలీసులు, భద్రతా బలగాలను ప్రజలందరూ అభినందించాలి."