తెలంగాణ

telangana

By

Published : Oct 21, 2020, 7:40 PM IST

ETV Bharat / bharat

'డిసెంబర్ నాటికి బంగాల్​లో రాష్ట్రపతి పాలన'

డిసెంబర్​ నాటికి బంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు ఆ రాష్ట్ర భాజపా యువ మోర్చా అధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు పూర్తిగా గాడి తప్పాయని అన్నారు. సౌమిత్ర వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ తిప్పికొట్టారు. చట్టబద్ధ పాలన కనుమరుగైన గుజరాత్, ఉత్తర్​ప్రదేశ్​పై భాజపా నేతలు దృష్టిసారించాలని హితవు పలికారు.

President's Rule to be imposed in Bengal by December: BJP MP Saumitra Khan
'డిసెంబర్ నాటికి బంగాల్​లో రాష్ట్రపతి పాలన'

బంగాల్​లో డిసెంబర్ నాటికి రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు ఆ రాష్ట్ర భాజపా యువ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ సౌమిత్రా ఖాన్ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో శాంతి, భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా కార్యకర్తలపై దాడులను ఖండించారు.

బంకురా జిల్లాలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

"రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి. భాజపా కార్యకర్తలను హత్య చేయడం రోజువారీ కార్యక్రమంలా మారింది. రాష్ట్రంలో డిసెంబర్ నాటికి రాష్ట్రపతి పాలన విధిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా."

-సౌమిత్రా ఖాన్

'మీ రాష్ట్రాలను చూసుకోండి!'

సౌమిత్ర వ్యాఖ్యలను టీఎంసీ దీటుగా తిప్పికొట్టింది. భాజపా పాలిస్తున్న ఉత్తర్​ప్రదేశ్, గుజరాత్​లోనే చట్టబద్ధ పాలన నశించిందని ఆరోపించింది. ముందుగా ఆ రాష్ట్రాలపై దృష్టిసారించాలని భాజపా నేతలకు హితవు పలికింది.

"రాష్ట్ర ప్రభుత్వానికి అపకీర్తి కలిగించేలా భాజపా శాంతి, భద్రతల అంశాన్ని లేవనెత్తుతోంది. వామపక్షాల హయాంలోని పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో శాంతి, భద్రతలు మెరుగ్గా ఉన్నాయి. న్యాయబద్ధమైన పాలన కనుమరుగైన ఉత్తర్​ప్రదేశ్, గుజరాత్​పై భాజపా నేతలు దృష్టిసారించాలి."

-సౌగత రాయ్, టీఎంసీ ఎంపీ

బంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించాలని భాజపా జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా పలువురు భాజపా నేతలు ఇప్పటికే డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి-దక్షిణ కొరియా ప్రధానితో మోదీ సంభాషణ

ABOUT THE AUTHOR

...view details