తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీరం'​ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని విచారం - రాహుల్​ గాంధీ వార్తలు

పుణె సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియాలో అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా.. పలువురు సంతాపం తెలిపారు. అయితే.. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారాన్ని ఇస్తున్నట్టు ప్రకటించింది సీరం సంస్థ.

President, PM Modi express grief after 5 die in Serum Institute fire incident
'సీరం'​ విషాద ఘటనపై కోవింద్​, మోదీ విచారం

By

Published : Jan 21, 2021, 10:32 PM IST

మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియాలో​ జరిగిన అగ్నిప్రమాద ఘటనపై.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా బాధించినట్టు చెప్పారు​. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ఆయన.. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్​ చేశారు.

మోదీ సంతాపం

ఈ ఘటనలో మరణించిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. 'ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా,' అని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

గురువారం మధ్యాహ్నం.. సీరం టర్మినల్ గేట్​ 1 వద్ద ఎస్​ఈజెడ్​-3 భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. అనంతరం.. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ దుర్ఘటనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ సహా.. పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాహుల్​ ట్వీట్​..

సీరం ఇన్​స్టిట్యూట్​లో దుర్ఘటన తనను తీవ్రంగా బాధించిందని కాంగ్రెస్ సీనియర్​​ నేత రాహుల్​ గాంధీ అన్నారు.

'ఈ అగ్నిప్రమాదంతో తీవ్రంగా కలత చెందాను. ఈ వార్త చాలా ఆందోళన కలిగించింది. మృతుల కుటుంబానికి నా సంతాపం. బాధిత కుటుంబసభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.'

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.​

'సీరం'ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి

ప్రమాదం జరిగిన సీరం ఇన్​స్టిట్యూట్​ను సందర్శించారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​. మంటలు చెలరేగిన ఫ్లోర్​లో.. ఒప్పంద కార్మికులు పనిచేసే వారని ఆయన తెలిపారు. అయితే.. అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకునేలోపే ఐదుగురు(పుణె-2, యూపీ-2, బిహార్​-1) మంటల్లో సజీవ దవహనమయ్యారని పేర్కొన్నారు​. వ్యాక్సిన్​ తయారీ కేంద్రం మాత్రం సురక్షితంగానే ఉందని వెల్లడించారు పవార్​. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే కూడా శుక్రవారం సీరం ఇన్​స్టిట్యూట్​ను సందర్శించే అవకాశముందని ఆయన చెప్పారు.

రూ.25లక్షల పరిహారం..

ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఆ సంస్థ ఛైర్మన్​ అదర్​ పూనావాలా.

ఇదీ చదవండి:'సాగు చట్టాల్ని రద్దు చేయాల్సిందే.. మరో మాట లేదు'

ABOUT THE AUTHOR

...view details