తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కష్టకాలంలో వైద్యుల పోరాటంపై రాష్ట్రపతి ప్రశంసలు - కరోనాపై పోరాటానికి ఇంకా ఏం చేద్దాం?

అన్ని రాష్ట్రాల గవర్నర్లతో.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కరోనా మహమ్మారిపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయడంపై చర్చించారు.

President of India Ramnath Kovind to Address all Governers amid India Coronavirus Crisis
అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్

By

Published : Mar 27, 2020, 11:38 AM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంపై చర్చే ప్రధాన అజెండాగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కొవిడ్​-19తో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

కరోనాపై పోరులో ఆయా రాష్ట్రాలలోని వైద్యవిభాగం చేస్తున్న సేవలను మెచ్చుకున్నారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. కష్టకాలంలోనూ ధైర్యంగా నిలబడిన వైద్యులపై కోవింద్​ ప్రశంసల జల్లు కురిపించారు.

అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 724 చేరగా... మొత్తం 17 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details