తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరిత వెలుగులు తెచ్చే టపాసులు చూశారా..? - environmentally friendly crockers prepaired in tamilanadu

దీపావళి టపాసులు పేల్చితే ఏమవుతుంది? సంతోషం కలుగుతుంది. దానితోపాటే వాతావరణం కలుషితం అవుతుంది. కానీ... చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థులు వినూత్న టపాసులు రూపొందించారు. వీటిని పేల్చితే కాలుష్యానికి బదులుగా పచ్చదనం పెరుగుతుంది.

హరిత వెలుగులు తెచ్చే టపాసులు చూశారా

By

Published : Oct 20, 2019, 3:02 PM IST

పర్యావరణ హిత టపాకాయల తయారీ

దీపావళి అంటేనే టపాసులు. పండుగకు కొద్దిరోజుల ముందే టపాకాయల మోత మొదలుకావాల్సిందే. కానీ... ఈ సరదా వెనుక దాగి ఉన్న ప్రమాదంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. బాణసంచా కారణంగా జరిగే వాయు, శబ్ద కాలుష్య తీవ్రత అందరికీ అర్థమవుతోంది.

మరి పర్యావరణం కోసం టపాసుల సరదాను వదులుకోవాల్సిందేనా? అవసరం లేదంటున్నారు చెన్నై మాధవరంలోని ఉద్యానవన కళాశాల విద్యార్థులు. ఇందుకోసం వినూత్న టపాకాయలను తయారు చేస్తున్నారు.

ఈ హరిత టపాసులు పెద్ద పెద్ద శబ్దాలు చేయవు. కాలుష్య కారకాలను విడుదల చేయవు. వీటిని మట్టితో తయారు చేస్తారు. దుకాణాల్లో దొరికే వాటిలాగానే రూపొందించి వత్తుల లోపల వివిధ రకాల విత్తనాలు వేస్తున్నారు. దీపావళి సందర్భంగా వీటిని తీసుకెళ్లి.. పండుగ అనంతరం ఇంటి ఆవరణలోని కుండీల్లో, ఖాళీ స్థలంలో వేయాలని సూచిస్తున్నారు. దీని ద్వారా మొక్కలు విరివిగా పెరిగి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెబుతున్నారు విద్యార్థులు.

"మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం. వినాయక చవితి, నవరాత్రుల్లో శ్రీకృష్ణ విగ్రహాలను మట్టితో తయారు చేసి వాటిలో వంకాయ, మిర్చి విత్తనాలు వేసి అందించాం. ఈ దీపావళికి సంప్రదాయ పద్ధతుల్లో రాకెట్​, ఇతర టపాసులను తయారు చేస్తున్నాం. టపాసుల ద్వారా వాతారవణ కాలుష్యం ఏర్పడుతుంది. అలా కాకుండా పర్యావరణ హిత దీపావళిని నిర్వహించాలనే ఉద్దేశంతో వేప, నిమ్మతో పాటు పూల మొక్కల విత్తనాలు వేసి వీటిని తయారు చేస్తున్నాం."

- ఉద్యానవన కళాశాల సిబ్బంది.

ఇదీ చూడండి:వైరల్​: పోలీసులను హడలెత్తించిన మొసలి

ABOUT THE AUTHOR

...view details