తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2019, 2:55 PM IST

Updated : Mar 7, 2019, 3:39 PM IST

ETV Bharat / bharat

"తప్పుగా ట్వీట్​ చేశాను"

కోర్టు ధిక్కరణ కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్​గా​ ఎం.నాగేశ్వర్​రావు నియామకం వ్యవహారంలో కేంద్రప్రభుత్వం కల్పిత పత్రాలు సమర్పించిందని తప్పుగా ట్వీట్​ చేశానని ఒప్పుకున్నారు.

కోర్టు ధిక్కరణ కేసు విచారణ హాజరైన న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​

కోర్టు ధిక్కరణ కేసు విచారణ హాజరైన న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్​ నియామకంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​పై నమోదైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై సుప్రీం విచారణ చేపట్టింది. ఎం.నాగేశ్వర్​ రావు నియామకంపై ఉన్నత స్థాయి ఎంపిక కమిటీ సమావేశానికి సంబంధించి కేంద్రప్రభుత్వం తప్పుడు వివరాలు కోర్టుకు సమర్పించిందని తప్పుగా ట్వీట్​ చేశానని న్యాయవాది భూషణ్​ అంగీకరించారు.

జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. న్యాయవాది భూషణ్​ వ్యాఖ్యలతో పిటిషన్​ను ఉపసంహరించుకుంటున్నట్లు అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ ధర్మాసనానికి తెలిపారు. న్యాయవాదికి ఎలాంటి శిక్ష విధించాలని కోరుకోవట్లేదని తెలిపారు.

అంతకుముందు... కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ నుంచి జస్టిస్​ మిశ్రా తప్పుకోవాలని దరఖాస్తు చేశారు భూషణ్​. జస్టిస్ మిశ్రా తప్పుకోవాలన్న వినతిపై కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్న ధర్మాసనం ఆదేశాలను తిరస్కరించారు.

కోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం అతిపెద్ద తప్పిదంగా పేర్కొంటూ ఏప్రిల్​ 3కు కేసు విచారణ వాయిదా వేసింది ధర్మాసనం.

Last Updated : Mar 7, 2019, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details