తెలంగాణ

telangana

By

Published : Aug 31, 2020, 5:57 PM IST

ETV Bharat / bharat

రాజనీతిలో సరిలేరు మీకెవ్వరూ..

ఆయనో రాజనీతిజ్ఞుడు. ఆర్థిక మంత్రిగా దేశ రథచక్రాన్ని పరుగులు పెట్టించిన చోదకుడు. దేశ అత్యున్నత పదవిని అలంకరించినా ఏనాడు గర్వం దరిచేరని మహనీయుడు. ఆయనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ. అసంఖ్యాక ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిన మేధావి.

Pranab Mukherjee
రాజనీతిలో సరిలేరు మీకెవ్వరూ..

స్వాతంత్ర్యానంతర భారత రాజకీయాలలో ఆయనది ప్రత్యేక శకం. భారత రాష్ట్రపతిగా, అద్భుతమైన వాక్​ చాతుర్యంతో అందరిని ఒప్పించే రాజనీతిజ్ఞుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా విభిన్న పాత్రలు పోషించి, రాజకీయ రంగంలో అనేక ఆటుపోట్లను తట్టుకొని దీటుగా నిలబడ్డ మధ్యతరగతి ప్రతిబింబం 'ప్రణబ్​ ముఖర్జీ'.

ప్రణబ్​ ముఖర్జీ

తలపండిన మేధావులు నిండిన పెద్దల సభలో 34 ఏళ్లకే అడుగుపెట్టారు ప్రణబ్​. 47 ఏళ్ల వయసులో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశ ఆర్థిక చక్రాలను పరుగులు పెట్టించారు. గాంధేయవాదిగా.. కరుడు కట్టిన కాంగ్రెస్​వాదిగా.. మచ్చలేని రాజకీయ నేతగా.. అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.

ప్రణబ్​ ముఖర్జీ

సున్నితంగా చెప్పినట్లు ఉన్నా చురుకుగా తన మనసులోని భావాలను ఎదుటివారికి అర్థం అయ్యేలా చెప్పగలిగే నేర్పరి ప్రణబ్​. మిత్రపక్షాలు బెట్టు చేసినా, ప్రత్యర్థి పార్టీలు ఉడుం పట్టు పట్టినా.. నొప్పించక ఒప్పించే శైలి ఆయనకే సొంతం.

ప్రణబ్​ ముఖర్జీ

కాంగ్రెస్​ పార్టీ ట్రబుల్​ షూటర్​గా, ఉత్తమ పార్లమెంటేరియన్​గా, భారత రాష్ట్రపతిగా ప్రతి స్థాయిలోనూ ఆయన చూపిన రాజనీతికి ప్రత్యర్థి పార్టీ నేతలే ముగ్ధులయ్యారు. అనేక సందర్భాల్లో ఆయన్ను కీర్తించారు.

దేశానికి ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవలకు గాను ఆయన్ను ప్రభుత్వం భారత రత్న పురస్కారంతో గౌరవించింది.

రాష్ట్రపతిగా ప్రణబ్​ ముఖర్జీ

రాజకీయ అవినీతి పెరుగుతున్న నేటి కాలంలో మచ్చలేని మహావ్యక్తిగా, నిజాయితీపరుడిగా, నిస్వార్థపరుడిగా, విలువలు పాటించే వ్యక్తిగా వెలుగొందిన ప్రణబ్​ ముఖర్జీ నేటితరం నాయకులందరికి ఆదర్శం.

ఒబామా దంపతులు, ప్రధాని మోదీతో ప్రణబ్

ABOUT THE AUTHOR

...view details