తెలంగాణ

telangana

By

Published : Apr 2, 2019, 7:25 PM IST

ETV Bharat / bharat

'ప్రజాస్వామ్యంలో కోటలు నిలబడలేవు'

ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలదే గెలుపు అని నటుడు ప్రకాశ్​ రాజ్ ఉద్ఘాటించారు. లౌకికవాదం పేరుతో భాజపా, కాంగ్రెస్​ వర్గ రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. లోక్​సభ  ఎన్నికల్లో మధ్య బెంగళూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రకాశ్​ రాజ్​తో ప్రత్యేకంగా మాట్లాడింది ఈటీవీ భారత్​.

ప్రకాశ్ రాజ్

ప్రజాస్వామ్యంలో రాచరికానికి స్థానం లేదని మధ్య బెంగళూరు లోక్​సభ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. పని చేసినవారికే మళ్లీ అధికారం దక్కుతుందని ధీమాగా చెప్పారు. భాజపా, కాంగ్రెస్​ రెండూ ఒకటేనని విమర్శించారు. మంచి అభ్యర్థి గెలిస్తే అది ప్రజల విజయమనీ..., మూర్ఖుడు నెగ్గితే ప్రజలు ఓడినట్టేనని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు ప్రకాశ్​ రాజ్​.

ప్రకాశ్ రాజ్​తో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details