తెలంగాణ

telangana

By

Published : Jan 1, 2020, 4:32 PM IST

Updated : Jan 1, 2020, 10:54 PM IST

ETV Bharat / bharat

కాంగ్రెస్ 'గందరగోళ' పార్టీ: ప్రకాశ్​ జావడేకర్​

సీడీఎస్​గా బిపిన్​ రావత్ నియామకంపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తడాన్ని తప్పుబట్టారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్​. కాంగ్రెస్​ గందరగోళ పార్టీ అని విమర్శించారు. సీడీఎస్​ పై రాజకీయం చేయాలని ప్రయత్నిస్తే ఖండించాల్సిందేనని తేల్చి చెప్పారు.

prakash-javadekar
కాంగ్రెస్ 'గందరగోళ' పార్టీ: ప్రకాశ్​ జావడేకర్​

కాంగ్రెస్ 'గందరగోళ' పార్టీ: ప్రకాశ్​ జావడేకర్​

కాంగ్రెస్​ను గందరగోళ పార్టీగా అభివర్ణించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్​. సీడీఎస్​గా బిపిన్​ రావత్​ను​ నియమించడంపై ఆ పార్టీ ప్రశ్నలు లేవనెత్తడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంపై రాజకీయాలు చేయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చిచేప్పారు.

సీడీఎస్ దేశంలో సరికొత్త వ్యవస్థకు నాంది పలికిందని.. దేశానికి గర్వకారణమన్నారు జావడేకర్. సీడీఎస్ నియామంకపై కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్​ ట్వీట్లను ఆయన సలహాదారులు పోస్ట్ చేస్తారని, కాంగ్రెస్ నేతలు భిన్నంగా మాట్లాడతారని అందుకే ఆ పార్టీ గందరగోళ పార్టీ అని దుయ్యబట్టారు.

సీడీఎస్​గా బిపిన్ రావత్​ను నియమించి ప్రభుత్వం తప్పటడుగు వేసిందని కాంగ్రెస్ నిన్న ఆరోపించింది.

ఇదీ చూడండి: సీడీఎస్​ నియామకం ఓ తప్పటడుగు: కాంగ్రెస్

Last Updated : Jan 1, 2020, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details