తెలంగాణ

telangana

సాధ్వీ ప్రజ్ఞా అభ్యర్థన తిరస్కరించిన ఎన్​ఐఏ కోర్టు

మాలేగావ్​ పేలుళ్ల కేసు విచారణలో హజరు నుంచి మినహాయింపు కోరారు సాధ్వీ ప్రజ్ఞాసింగ్​. కానీ భోపాల్​ ఎంపీ అభ్యర్థనను ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. వారంలోపు కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు.

By

Published : Jun 3, 2019, 7:10 PM IST

Published : Jun 3, 2019, 7:10 PM IST

Updated : Jun 3, 2019, 7:45 PM IST

సాధ్వీ ప్రజ్ఞా అభ్యర్థన తిరస్కరించిన ఎన్​ఐఏ కోర్టు

సాధ్వీ ప్రజ్ఞా అభ్యర్థన తిరస్కరన

మాలేగావ్​ పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న భోపాల్​ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్​కు ఎన్​ఐఏ కోర్టులో చుక్కెదురైంది. విచారణలో భాగంగా కోర్టు హాజరు నుంచి మినహాయింపు కావాలని ప్రజ్ఞా చేసిన అభ్యర్థనను ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టు న్యాయముర్తి తిరస్కరించారు. వారంలోపు కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు న్యాయమూర్తి వీ ఎస్​ పదల్కర్​.

ఇటీవలే ఎంపీగా ఎన్నికైనందు వల్ల పార్లమెంటులో కొన్ని లాంఛనాలు పూర్తి చేయాలని... అందుకే కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినట్టు ప్రజ్ఞాసింగ్​ పేర్కొన్నారు. ఈ దశలో విచారణకు సాధ్వీ ప్రజ్ఞా హాజరవ్వడం అవసరమన్న న్యాయమూర్తి... ఆమె వినతిని తిరస్కరించారు.

మినహాయింపునకు తొలుత న్యాయమూర్తి అంగీకరించారు. కానీ సాక్ష్యులు ఆధారాలు సమర్పించే సందర్భంలో నిందితురాలు కోర్టులో ఉండటం ఆవసరమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'పాక్ ఆటగాళ్లకు భారత కెప్టెన్ ఆదర్శం​'

Last Updated : Jun 3, 2019, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details