జాతి పిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించడంపై భాజపా ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. గాడ్సే వ్యాఖ్యలపై రాజకీయంగా పెను దుమారం రేగిన నేపథ్యంలో ఈ మేరకు లోక్సభలో ప్రకటన చేశారు.
ప్రగ్యా క్షమాపణలు కోరినప్పటికీ.. విపక్షాలు నిరసనలు చేపట్టాయి. క్షమాపణలు ఆమోదించేది లేదని.. సభ నుంచి ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో వివిధ పార్టీల సభ్యులతో స్పీకర్ ఓం బిర్లా సమావేశమయ్యారు. ప్రగ్యా వ్యాఖ్యలపై నేతలో చర్చలు జరిపారు. ప్రగ్యా భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఏకాభిప్రాయనికి వచ్చారు నేతలు.
ఆ భేటీ అనతరం సభలో మరోమారు క్షమాపణలు కోరారు ప్రగ్యా. విపక్షాల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చిన ప్రకటనను చదివి వినిపించారు.