తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​పై చర్యలు తీసుకోవాలని స్పీకర్​కు ప్రగ్యా లేఖ - rahul gandhi news

రాహుల్​ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు ప్రగ్యా సింగ్​ ఠాకూర్​. ఈ మేరకు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాకు లేఖ రాశారు.

Pragya Takur
రాహుల్​పై చర్యలు తీసుకోవాలని స్పీకర్​కు లేఖ

By

Published : Nov 29, 2019, 7:54 PM IST

కాంగ్రెస్‌ అగ్రనేత నేత రాహుల్‌ గాంధీ తనను ఉగ్రవాదిగా అభివర్ణించినందున ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. ఏ న్యాయస్థానం కూడా తనను దోషిగా నిర్ధరించకుండా ఉగ్రవాదిగా పిలవడం.. పార్లమెంటు సభ్యురాలిగా తన హక్కులను భంగపర్చడమేనని పేర్కొన్నారు.

ఈ లేఖను లోక్‌సభ సచివాలయం పరిశీలించి సరైనదే అని తేలితే స్పీకర్‌కు నివేదించనుంది. అనంతరం ఆయన ఈ లేఖను సభా హక్కుల కమిటీకి పంపిస్తారు.

ఇదీ చూడండి: గుర్రం పేడలో బంగారం స్మగ్లింగ్​.. పట్టేసిన పోలీసులు!​

ABOUT THE AUTHOR

...view details