తెలంగాణ

telangana

2 గంటల పాటు కోర్టులో నిల్చొన్న సాధ్వీ..!

భోపాల్​ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్​ ప్రవర్తన మరోమారు చర్చనీయాంశమైంది. 2008 మాలేగావ్​ పేలుళ్ల కేసులో శుక్రవారం విచారణకు హాజరైన ప్రజ్ఞా... కోర్టు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కుర్చీలో దుమ్ముందన్న కారణంతో రెండున్నర గంటల పాటు నిల్చునే ఉన్నారు ప్రజ్ఞా.

By

Published : Jun 8, 2019, 5:45 AM IST

Published : Jun 8, 2019, 5:45 AM IST

గంటలపాటు కోర్టులో నిల్చున్న సాధ్వీ

వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రవర్తనతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు భోపాల్​ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్​ ఠాకూర్​.తాజాగా 2008 మాలేగావ్​ పేలుళ్ల కేసు విచారణలో భాగంగా ముంబయి ప్రత్యేక కోర్టులో శుక్రవారం హాజరయ్యారు సాధ్వీ. అనంతరం కోర్టులో సరైన వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజ్ఞా... ఏకంగా రెండు గంటల పాటు నిల్చునే ఉన్నారు.

ఇదీ జరిగింది

విచారణలో భాగంగా సాధ్వీ కూర్చునేందుకు బోనులో కుర్చీని ఏర్పాటు చేశారు. ఆ కుర్చీపై అసంతృప్తి వ్యక్తం చేసిన భోపాల్​ ఎంపీ... కిటికీకి ఆనుకుని నిలబడ్డారు. విచారణ ప్రారంభమైన కొద్ది సేపటికి బోను పక్కన కుర్చీని ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ సాధ్వీ అలాగే రెండున్నర గంటల పాటు నిల్చునే ఉన్నారు.

విచారణ ముగిసిన అనంతరం కోర్టు గదిలో వసతులు సరిగా లేవని ఆరోపించారు సాధ్వీ. తనను కూర్చునేందుకు సూచించిన కుర్చీని చూపిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. 'ఇలాంటి కుర్చీలో కూర్చుంటే నేను ఆస్పత్రిలో పడుకోవాల్సిందే'నని అసహనం వ్యక్తం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్​ నేత దిగ్విజయ్​సింగ్​ను ఓడించి భోపాల్​ ఎంపీగా బాధ్యతలు చేపట్టారు సాధ్వీ.

ఇదీ చూడండి: 'అమర్​నాథ్​ యాత్ర' ఏర్పాట్లపై కేంద్రం కసరత్తు

ABOUT THE AUTHOR

...view details