తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ట్రింగ్​ట్రింగ్​ నేడు కాదు... సోమవారం! - కశ్మీర్​ పర్యాటకం

కశ్మీర్​లో మొబైల్ పోస్ట్​పెయిడ్ సేవల పునరుద్ధరణ సోమవారానికి వాయిదా పడింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

కశ్మీర్​లో ట్రింగ్​ట్రింగ్​ నేడు కాదు... సోమవారం!

By

Published : Oct 12, 2019, 3:36 PM IST

జమ్ముకశ్మీర్​లో సోమవారం నుంచి పోస్ట్​ పెయిడ్ మొబైల్ సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 14 మధ్యాహ్నం నుంచి ఈ సేవలు పునరుద్ధరించనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి రోహిత్​ కన్సాల్ తెలిపారు. శనివారమే ఈ సేవలు పునరుద్ధరించాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో సాంకేతిక సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

కశ్మీర్ ​లోయలో 40 లక్షల మంది పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఉన్నారు. వీరికి సేవలు పునరుద్ధరించిన తర్వాత... ప్రీపెయిడ్ కనెక్షన్లను తిరిగి ప్రారంభించనున్నారు. అయితే అంతర్జాల సేవల కోసం ఇంకా కొన్ని రోజులు వేచి చూసే పరిస్థితి నెలకొంది.

పర్యటకం కోసమే!

కేంద్ర ప్రభుత్వం కశ్మీర్​ లోయకు పర్యటకులను అనుమతించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ట్రావెల్ అసోసియేషన్ సభ్యులు సంబంధిత ప్రభుత్వ అధికారులను కలిశారు. టెలిఫోన్​ సిగ్నల్స్ లేకుంటే పర్యటకులు రావడానికి మొగ్గు చూపరని అధికారులకు విన్నవించారు.

ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్-370 రద్దు చేసినప్పటినుంచి కశ్మీర్​లో మొబైల్, అంతర్జాల సేవలు నిలిపివేశారు. ఆగస్టు 17న పాక్షికంగా టెలిఫోన్ సేవలు పునరుద్ధరించారు. సెప్టెంబర్ 4 నుంచి ల్యాండ్​ఫోన్ సేవలను తిరిగి ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details