తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగేళ్లుగా ఉత్తరాలు పంపిణీ చేయని పోస్ట్​మాన్​! - A Lazy karnataka Postmaster Didn't Deliver postcards

ఓ పోస్ట్​మాన్​ గత నాలుగేళ్లుగా ఉత్తరాలు, ఏటీఎంలు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేసిన ఘటన కర్ణాటక కొప్పల్ జిల్లా సంగనాల గ్రామంలో జరిగింది. విధులను నిర్లక్ష్యం చేసిన పోస్ట్​మాన్​ సురేశ్​ తలవారాపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నాలుగేళ్లుగా ఉత్తరాలు పంపిణీ చేయని పోస్ట్​మాన్​!

By

Published : Nov 16, 2019, 5:52 AM IST

నాలుగేళ్లుగా ఉత్తరాలు పంపిణీ చేయని పోస్ట్​మాన్​!

నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన ఓ పోస్ట్​మాన్ గురించి మీకు తెలుసా? గత నాలుగేళ్లలో అతను పోస్టుకార్డులు, ఉత్తరాలు, ఏటీఎంలు ఏవీ ప్రజలకు పంపిణీ చేయలేదు. ఆయనే కర్ణాటక కొప్పల్​ జిల్లా సంగనాల గ్రామానికి చెందిన సురేశ్​ తలవారా.

సురేశ్​ తలవారా 2014 నుంచి తన విధులను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాడు. దీనితో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ప్రజలు సురేశ్​ను నిలదీసి, అతని బండారాన్ని బయటపెట్టారు. తపాలా కార్యాలయంలో చూడగా వెయ్యికి పైగా పంపిణీ చేయకుండా ఉంచిన లేఖలు, ఏటీఎంలు కనిపించాయి. ఉన్నతాధికారులు సురేశ్​పై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:బూతు బొమ్మలు చూస్తే ఇక సీబీఐ కేసులే!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details