తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్ర దుశ్చర్యలకు పాక్​ విశ్వప్రయత్నాలు

ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్​లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు పాకిస్థాన్ అనేక సార్లు ప్రయత్నించిందని సీనియర్ భద్రతా అధికారి తెలిపారు. ఆగస్టు 21న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను నియంత్రణ రేఖ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

By

Published : Sep 4, 2019, 9:13 PM IST

Updated : Sep 29, 2019, 11:16 AM IST

కశ్మీర్​లో ఉగ్ర దుశ్చర్యలకు పాక్​ విశ్వప్రయత్నాలు

కశ్మీర్ ​లోయలోకి ఉగ్రవాదులు చొరబడేలా చేసేందుకు పాకిస్థాన్​ విశ్వప్రయత్నాలు చేసిందని భారత సైన్యాధికారి వెల్లడించారు. ఆర్టికల్​ 370 రద్దయిన ఆగస్టు 5 తర్వాత ఈ ప్రయత్నాలను మరింత పెంచిందని తెలిపారు. కశ్మీర్​లోకి చొరబాటుకు యత్నించిన ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులు తమ అదుపులో ఉన్నట్లు సైన్యాధికారి కేజేఎస్​ డిల్లాన్ చెప్పారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మార్గాల ద్వారా ముష్కరులు చొరబడేందుకు ఆ దేశ సైన్యం ఏర్పాట్లు చేసిందని భారత సైన్యాధికారి పేర్కొన్నారు. తమ అధీనంలో ఉన్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వద్ద పట్టుబడినట్లు వివరించారు. కశ్మీర్​లో దాడులు నిర్వహించేందుకు పాక్ సైన్యమే తమని పంపిందని పట్టుబడ్డ మహ్మద్ ఖలీల్, మహ్మద్ నజీం వెల్లడించారని డిల్లాన్ తెలిపారు. వీరిద్దరూ లష్కరే తోయిబా సంస్థలో శిక్షణ తీసుకున్నారని, పాక్ సైన్యం కూడా వీరికి శిక్షణ ఇచ్చి భారత్​పైకి ఉసిగొల్పిందన్నారు. రావల్పిండికి చెందిన వీరు మరికొంత మంది సహచరుల పేర్లను వెల్లడించినట్లు డిల్లాన్​ చెప్పారు.

ఆగస్టు 21న గుల్మార్గ్​ సెక్టార్​లో నియంత్రణ రేఖ వద్ద అదుపులోకి తీసుకున్న ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు అధికారులు. వీడియోలో 'టీ' ఎలా ఉందని ఉగ్రవాదిని అధికారులు అడగ్గా... బాగుందని బదులిచ్చాడు. కశ్మీర్​ లోయలో దాడులు నిర్వహించేందుకే తమను పంపారని ఒప్పుకున్నారు ఖలీల్, నజీం.


ఇదీ చూడండి: హోంమంత్రి అమిత్​ షాకు శస్త్రచికిత్స

Last Updated : Sep 29, 2019, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details