తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నెల రోజులు.. రూ.263 కోట్లు నీటిపాలు! - bihar cm latest news

బిహార్​లో రూ.263.5 కోట్లతో నిర్మించిన ఓ వంతెన వరదల ధాటికి కొట్టుకుపోయింది. నిర్మాణం పూర్తయి నెల కూడా తిరగకముందే ఇలా జరగడం గమనార్హం. వంతెన కూలిపోవటంపై సీఎం నితీశ్ కుమార్​ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి ప్రతిపక్షాలు.

Portion of Sattarghat Bridge on Gandak River that was inaugurated by CM Nitish Kumar last month in Gopalganj collapsed
రూ. 263.5 కోట్లతో నిర్మించిన వంతెన.. నెల తిరగకముందే

By

Published : Jul 16, 2020, 11:19 AM IST

బిహార్‌లోని గోపాల్‌ గంజ్‌ జిల్లాలో 263.5 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన నెలతిరగక ముందే వరదలకు కొట్టుకుపోయింది. తూర్పు చంపారన్‌ను గోపాల్‌గంజ్‌ను కలుపుతూ 8 ఏళ్ల వ్యవధిలో గందక్‌ నదిపై సత్తర్‌ఘాట్ పేరిట వంతెనను నిర్మించారు. గత నెల 16న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ప్రారంభించారు.

రూ. 263.5 కోట్లతో నిర్మించిన వంతెన.. నెల తిరగకముందే
రూ. 263.5 కోట్లతో నిర్మించిన వంతెన.. నెల తిరగకముందే

అయితే నెల తిరగక మునుపే.. బుధవారం నాడు ఆ వంతెనలో కొంత భాగం వరదకు కొట్టుకుపోయింది. దీనిపై విపక్షాలు నితీశ్ సర్కారును లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇదీ చూడండి: గుజరాత్​, అసోం రాష్ట్రాల్లో భూప్రకంపనలు

ABOUT THE AUTHOR

...view details