తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారతీయ సన్యాసినికి సెయింట్​హుడ్​ ప్రకటించిన పోప్​ - Indian nun Mariam Thresia and four others were declared Saints

దివంగత క్యాథలిక్ క్రైస్తవ సన్యాసిని మరియం థ్రెసియాకు అరుదైన గౌరవం లభించింది. భారతీయురాలైన ఆమెను సెయింట్​హుడ్​ (పునీతురాలు)గా ప్రకటించారు ఆ మతపెద్ద పోప్​ ఫ్రాన్సిస్. వాటికన్ సిటీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవాన్ని అందించారు.

భారతీయ సన్యాసినికి సెయింట్​హుడ్​ ప్రకటించిన పోప్​

By

Published : Oct 13, 2019, 3:48 PM IST

Updated : Oct 13, 2019, 5:34 PM IST

భారతీయ సన్యాసినికి సెయింట్​హుడ్​ ప్రకటించిన పోప్​

భారతీయ క్యాథలిక్ క్రైస్తవ సన్యాసిని మరియం థ్రెసియాకు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో క్యాథలిక్ చర్చి మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్.. కేరళకు చెందిన దివంగత సన్యాసిని థ్రెసియాకు ఈ పునీత పట్టాన్ని (సెయింట్​హుడ్)​ను అందించారు. దీని ద్వారా నేటి నుంచి ఆమెను సెయింట్ మరియం థ్రెసియాగా పిలుస్తారు. థ్రెసియాతో పాటు వివిధ దేశాలకు చెందిన మరో నలుగురికి ఈ గౌరవాన్ని అందించారు.

త్రిస్సూర్​​కు చెందిన మరియం సిస్టర్స్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీకి చెందిన క్రైస్తవ మత విభాగాన్ని 1914లో స్థాపించారు. 1876లో క్రైస్తవ్యాన్ని స్వీకరించిన థ్రెసియా.. అనంతరం సన్యాసినిగా మారారు. 1904లో ఒక ప్రత్యేక లక్ష్యంతో తన పేరుముందు మరియం అనే పదాన్ని చేర్చుకున్నారు. 1914లో 'సిస్టర్స్​ ఆఫ్​ ద హోలీ ఫ్యామిలీ' అనే కాన్వెంట్​ను స్థాపించారు. 1926 జూన్ 8న 50 ఏళ్ల వయస్సులో పరమపదించారు.

2000 సంవత్సరంలో థ్రెసియాకు ధన్యతా పట్టాన్ని అందించారు నాటి పోప్ రెండో జాన్​పాల్. ఈ ధన్యతా పట్టం... సెయింట్​హుడ్ కంటే కొద్దిగా తక్కువ.

మానవసేవలో అంకితభావం, దివంగతురాలైన అనంతరం తనకు ప్రార్థించేవారికి జరిగే స్వస్థతలు సహా స్థానిక చర్చి సిఫారసుల మేరకు అందించే ఈ పునీత పట్టాన్ని మరియం థ్రెసియాకు ఇవ్వాలని 2019 ఫిబ్రవరి 12న నిర్ణయించారు. థ్రెసియా తన జీవిత కాలంలో పాఠశాలల నిర్మాణం, అనాథ శరణాలయాల ఏర్పాటు సహా తాను జీవించి ఉన్న కాలంలో పలు సామాజిక సేవలు చేశారు.

కేరళ నుంచి నలుగురు పునీతులు...

మరియం థ్రెసియాకు పునీత పట్టంతో కేరళలోని పురాతన సైరో మలబార్ చర్చికి చెందిన నలుగురికి ఈ అరుదైన గౌరవం దక్కినట్లయింది. ఇంతకుముందు 2008లో సిస్టర్ అల్ఫొన్సా, అంతకుముందు కురియాకోస్ చావరా అచెన్, సిస్టర్ యుఫ్రెసియాకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

మోదీ నోటి వెంట థ్రెసియా మాట..

సెప్టెంబర్ 29నాటి మన్​కీ బాత్ కార్యక్రమంలో సిస్టర్ మరియం థ్రెసియాకు పునీత పట్టాన్ని అందించే అంశాన్ని గుర్తు చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఆమె మానవత్వానికి ప్రతీకగా నిలిచిపోయారని ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి: చిరుత వేట: గుమ్మం ముందు నిద్రించే శునకాలే టార్గెట్​!

Last Updated : Oct 13, 2019, 5:34 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details