తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా నిధికి రూ. 10వేలు విరాళమిచ్చిన భిక్షగాడు - Corona donation in Tamilnadu

తమిళనాడుకు చెందిన ఓ యాచకుడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులను చూసి చలించిపోయాడు. తన వంతుగా రూ.10 వేలు కరోనా ఉపశమన నిధికి విరాళంగా ఇచ్చాడు. రాష్ట్రంలోని మధురై జిల్లాకు చెందిన పూల్​పాండ్యన్​... ఆ జిల్లా పాలనాధికారి టీజీ వినయ్​కు ఆ మొత్తాన్ని అందించాడు.

Poolpandiyan, an alms seeker in Madurai gave Rs 10,000 to District Collector as donation to corona relief fund
కరోనా నిధికు రూ. 10వేలు విరాళం ఇచ్చిన యాచకుడు

By

Published : May 18, 2020, 9:57 PM IST

పూల్​పాండ్యన్...​ తమిళనాడులోని మధురై జిల్లాలో ఓ యాచకుడు. తన ఆకలి తీర్చుకోవాలంటే నలుగురి దగ్గర చేయి చాచాల్సిందే. తెల్లవారి లేస్తే ఆహారం దొరుకుతుందో లేదో అన్న బెంగ తప్పదు. అయినా నలుగురూ ఇచ్చిన రూపాయి రూపాయి కూడబెట్టి.. రూ.10వేలు దాచాడు​.

కరోనా నిధికు రూ. 10వేలు విరాళం ఇచ్చిన యాచకుడు

ఆ డబ్బును ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి.. చదువుకోలేని వారికి విరాళంగా ఇవ్వాలనుకున్నాడు పాండ్యన్. కానీ మహమ్మారి కరోనా పరిస్థితులను తారుమారు చేసింది. మనసు చలించిపోయిన పాండ్యన్.. ఆ డబ్బును కరోనా ఉపశమ నిధికి ఇచ్చాడు. స్వయంగా జిల్లా పాలనాధికారికి ఆ మొత్తాన్ని అందించాడు.

కరోనా నిధికు రూ. 10వేలు విరాళం ఇచ్చిన యాచకుడు

"ఈ డబ్బులను చదువు కోసం విరాళంగా ఇవ్వాలనుకున్నాను. కానీ రాష్ట్రంలో మహమ్మారి సమస్య పెద్దదిగా తయారైంది. అందుకే కరోనా ఉపశమ నిధికి అందజేశాను." -పూల్​పాండ్యన్

కరోనా నిధికు రూ. 10వేలు విరాళం ఇచ్చిన యాచకుడు

ఇదీ చూడండి:తండ్రిని సైకిల్​పై 1300 కి.మీ తొక్కిన కూతురు

ABOUT THE AUTHOR

...view details