పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో అన్నాచెల్లెల్లు ప్రత్యర్థులుగా తలపడిన అరుదైన ఘటన ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుగా అన్న- నక్సలైట్గా చెల్లి ఎదురుపడ్డారు.
గతంలో మావోయిస్టుగా ఉన్న వెట్టి రామ అనే వ్యక్తి గత ఏడాది చీకటి పోరాటాన్ని వదిలి పోలీసుల్లో చేరారు. ఆయన చెల్లి మాత్రం నక్సలైట్గానే ఉండిపోయింది.
"జులై 29న జరిగిన ఎన్కౌంటర్ సందర్భంగా పోలీసు వెట్టి రామ, అతడి నక్సలైట్ చెల్లెలు వెట్టి కన్ని ఎదురుపడ్డారు. కన్నితో వచ్చినవారు రామపై కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కన్ని చాకచక్యంగా తప్పించుకుంది."