తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాహో పోలీస్​: అన్నపూర్ణలుగా మారిన రక్షకభటులు - సాహో పోలీస్​: అన్నార్థుల ఆకలి తీర్చేందుకు కదిలిన రక్షక భటులు

దేశవ్యాప్త లాక్​డౌన్ నేపథ్యంలో ఎవరు రోడ్లపై కనిపించినా పోలీసులు చితకబాదుతున్నారు. అదే సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారికి స్వయంగా వెళ్లి ఆహారం అందిస్తున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే.. మరో వైపు అన్నార్థులకు బాసటగా నిలుస్తూ ప్రజల చేత సాహో​ అనిపించుకుంటున్నారు. కొంత మంది సామాజిక కార్యకర్తలు ఈ బాటలోనే నడుస్తున్నారు.

Police personnel deployed at Civil Lines Police Station prepared food for the needy & distributed among them amid lockdown, in the wake of #Coronavirus outbreak.
సాహో పోలీస్​: అన్నార్థుల ఆకలి తీర్చేందుకు కదిలిన రక్షక భటులు

By

Published : Mar 27, 2020, 11:57 AM IST

కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా 21 రోజులు విధించిన లాక్​డౌన్​ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ఇళ్లలో ఉండాలని అధికారులు ఎంత చెప్పినా.. కొంత మంది వినకుండా రోడ్లపై సంచరిస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు రోడ్లపై ఎవరు కనిపించినా పోలీసులు చితకబాదుతున్నారు. మరోవైపు ఆకలితో అలమటిస్తున్న వారికి బాసటగా నిలుస్తూ దాతృత్వం చాటుతున్నారు రక్షక భటులు.

ఆహారాన్ని తయారు చేస్తున్న పోలీసు సిబ్బంది

మేమున్నామంటూ...

పంజాబ్​ లూథియానాలో లాక్​డౌన్ నేపథ్యంలో కనీస నిత్యవసరాలు లేక.. ఆకలితో ఆలమటిస్తున్న వారికి ఆహారం సమకూరుస్తున్నారు పోలీసులు. ప్రయాగ్​రాజ్​లోనూ తిండికి నోచుకోని వారికి చేయూతగా నిలబడ్డారు సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ సిబ్బంది. వివిధ రకాల ఆహార పదార్థాలను ప్యాక్ చేసి అవసరమైన వారికి పంచుతున్నారు.

మూగజీవులకు మేమున్నామంటూ..

మూగజీవులకు ఆసరాగా...

మాహారాష్ట్రలో కాజల్​, దిశ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మూగజీవుల ఆకలిని తీరుస్తున్నారు. జనజీవనం స్తంభించి, శునకాలు ఆహారం కోసం అలమటిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో వాటి ఆకలి తీర్చడం మన బాధ్యతని చెప్పారు వారు.

నిర్మానుష్యంగా మారిన రోడ్లు.. అన్నార్థులకు అండగా

దేశమంతా కరోనాపై పోరాటం.. మేము మాత్రం..

కోల్​కతాలోని దమ్ దమ్ రైల్వే స్టేషన్ అండర్ పాస్ వద్ద ఆశ్రయం పొందిన వారికి.. కొంత మంది సామాజిక కార్యకర్తలు చేయూతగా నిలిచారు. 3 రోజులుగా ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించి, దుకాణాలు మూసేయడం వల్ల వీరంతా తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశమంతా కరోనాపై పోరాడుతోంటే.. తాము ఆకలితో పోరాడుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కోల్​కతాలోని వీధులన్నీ కర్ఫ్యూ వల్ల నిర్మానుష్యంగా మారాయి.

ABOUT THE AUTHOR

...view details