తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2019, 7:15 AM IST

ETV Bharat / bharat

మోదీపై పోటీకి ముఖ్యమంత్రి తండ్రి సై!

ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి తండ్రి నంద్​ కుమార్​ బఘేల్​ తెలిపారు. మోదీని ఓడించి..రాహుల్​ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమని స్పష్టంచేశారు.

మోదీ, బఘేల్

మోదీకి పోటీగా నంద్​ కుమార్​ బఘేల్​
ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ తండ్రి నంద్​ కుమార్​ బఘేల్​ ముందుకొచ్చారు. మోదీపై వారణాసి లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

నరేంద్ర మోదీ ఓ నియంతల వ్యవహరిస్తున్నారని బఘేల్​ ఆరోపించారు. మోదీ దేశానికి అసత్య వాగ్దానాలు చేశారని ఆయనపై పోటీ చేసేందుకు కాంగ్రెస్​ తనకు అవకాశం ఇవ్వాలని కోరారు."నేను ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్​ టికెట్​ ఇస్తే..మోదీని ఓడించి..రాహుల్​ను తరువాతి ప్రధానిని చేస్తా" -నంద్ కుమార్​ బఘేల్​, ఛత్తీస్​గఢ్​ సీఎం తండ్రి

ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్​ పొత్తు పెట్టుకోకూడదని బఘేల్​ అభిప్రాయపడ్డారు. ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే రాహుల్​ గాంధీని ప్రధాని చేయాలనే షరతు విధించాలని సూచించారు. ప్రస్తుతం బఘేల్​ ఏ పార్టీలోనూ సభ్యుడిగా లేరు.

ABOUT THE AUTHOR

...view details