తెలంగాణ

telangana

జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్న మోదీ

By

Published : Dec 16, 2020, 4:36 AM IST

1971 ఇండో పాక్ యుద్ధానికి యాభై ఏళ్లు నిండిన నేపథ్యంలో.. అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు అర్పించనున్నారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించనున్నారు. వీటిని దేశంలోని నలుమూలలకు పంపించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

PM to light 'Swarnim Vijay Mashaal' on 50th anniversary of 1971 Indo-Pak war
జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్న మోదీ

పాకిస్థాన్​తో 1971 జరిగిన యుద్ధంలో విజయానికి యాభై ఏళ్లు నిండిన నేపథ్యంలో దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. యుద్ధంలో మరణించిన జవానులకు సంఘీభావంగా 'స్వర్ణ విజయ జ్యోతి'ని వెలిగించనున్నారు. యుద్ధ స్మారకం వద్ద మోదీకి రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఆహ్వానం పలుకుతారని ఆ శాఖ వెల్లడించింది. సైనికులకు మోదీతో పాటు, తిదళాధిపతి, త్రివిధ దళాల అధిపతులు నివాళులు అర్పిస్తారని పేర్కొంది.

ఈ విజయ జ్యోతులను దేశనలుమూలలకు తీసుకెళ్లేలా రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 1971 యుద్ధంలో పాల్గొని పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డులు అందుకున్న జవానుల గ్రామాలకు సైతం వీటిని పంపించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.

ఏడాది పాటు

పాకిస్థాన్​పై సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16ను విజయ్ దివస్​గా నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. 1971 యుద్ధానంతరం తూర్పు పాకిస్థాన్(బంగ్లాదేశ్) ప్రత్యేక దేశంగా ఏర్పడింది. ఇది జరిగి 50 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఏడాది పాటు స్వర్ణ విజయ సంబరాలు నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. యుద్ధంలో పాల్గొన్నవారిని సత్కరించడం, సెమినార్లు, ఎగ్జిబిషన్లు, ఆయుధ ప్రదర్శనలు, సాహస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించింది.

ABOUT THE AUTHOR

...view details